News November 7, 2024

ఛార్జింగ్‌లో పేలిన ఐఫోన్.. చైనా యువతి ఆరోపణ

image

తన ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా పేలిపోయిందని చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన యువతి ఆరోపించారు. ఆ సమయంలో తాను నిద్రపోతున్నానని, పేలుడు కారణంగా చేతికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గది అంతటా మంటలు వ్యాపించి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ఆమె ఆరోపణలపై యాపిల్ స్పందించింది. ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దర్యాప్తు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News

News October 26, 2025

తులసి మొక్క ఇంటికి ఏ దిశలో ఉండాలి?

image

ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘తులసి ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మొక్క సూర్యునికి అభిముఖంగా, తూర్పు దిశలో ఉండటం శ్రేయస్కరం. ఉత్తరంలోనూ ఉండొచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోడానికి ఉదయం కొంత సమయం తులసి దగ్గర గడపాలి. ఈ మొక్క ఎదుగుదల ఇంట్లోవారికి కొన్ని సూచనలిస్తుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 26, 2025

కర్నూలు దుర్ఘటన.. చివరి నిమిషంలో బస్సెక్కి మృతి

image

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన 19వ వ్యక్తి చిత్తూరు(D)కు చెందిన త్రిమూర్తి అని తేలింది. ఆయన రిజర్వేషన్ లేకున్నా ఆరాంఘర్‌(HYD)లో బస్సెక్కారు. తన ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి DNA శాంపిల్స్ పరీక్షించగా చనిపోయింది త్రిమూర్తేనని తేలింది. TGకి చెందిన తరుణ్ రిజర్వేషన్ చేసుకున్నా చివరి నిమిషంలో బస్సెక్కకుండా ప్రాణాలు కాపాడుకోగా త్రిమూర్తిని మృత్యువు వెంటాడింది.

News October 26, 2025

నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

image

TG: రాష్ట్రంలో నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్ చేపట్టాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మీటింగ్‌లో నిర్ణయించారు. NOV 1లోపు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని లేకపోతే నిరవధిక బంద్ చేపడతామని ఆ సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు ప్రకటించారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రోజుకో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అటు HYDలో లెక్చరర్లతో భారీ బహిరంగ సభ, 10లక్షల మంది విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.