News March 20, 2025
IPLకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం

ఉప్పల్ స్టేడియంలో IPL కోసం పనులు కొనసాగుతున్నాయి. లైటింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, వాష్ రూమ్స్ క్లీనింగ్, మంచినీటి సదుపాయంపై ఫోకస్ పెట్టినట్లు HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ తెలిపారు. 600-800 కార్మికులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గత ఐపీఎల్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామన్నారు. ఈ సారి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తున్నామని, స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు జగన్ మోహన్ తెలిపారు.
Similar News
News November 19, 2025
నేటి నుంచి ఉమ్మడి వరంగల్లో పత్తి కొనుగోలు ప్రారంభం

ఉమ్మడి వరంగల్లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం కానున్నాయి. సీసీఐ కొనుగోళ్లలో తలెత్తిన సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ట్రేడర్స్ అసోసియేషన్ బంద్ విరమించింది. సచివాలయంలో మంత్రి నాగేశ్వరరావు, అధికారులు, సీసీఐ ప్రతినిధులు, కాటన్ ట్రేడర్స్ అసోసియేషన్తో సమావేశమై జిన్నింగ్-ప్రెస్సింగ్ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ హామీ మేరకు కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.
News November 19, 2025
ఉమ్మడి కరీంనగర్లోని ప్రముఖ ‘అయ్యప్ప ఆలయాలు’..!

MTPL ధర్మశాస్తాలయం
JMKT
కేశవపట్నం, వంకాయగూడెం
గొల్లపల్లి, చిల్వకోడూర్
HZB
కోరుట్ల అయ్యప్పగుట్ట
మల్యాల
రాయికల్
ఇల్లంతకుంట
ధర్మారం
VMWD
ధర్మపురి
ముస్తాబాద్
PDPL
SRCL
మంథని
చొప్పదండి
సుల్తానాబాద్
ఎల్లారెడ్డిపేట
కాల్వశ్రీరాంపూర్
GDK
KNR- భగత్, జ్యోతి, మధురా, మహాత్మానగర్, కశ్మీర్, గోదాంగడ్డ, గంగాధర, తీగలగుట్టపల్లి, తిమ్మాపూర్
News November 19, 2025
పద్మనాభంలో స్వామి ఉత్సవం ఎలా ప్రారంభమైంది?

పద్మనాభంలోని గిరి ప్రాంతంలో 1938లో విజయనగరం పాలకుడు పూసపాటి అలక్ నారాయణ గజపతి ఆనతి మేరకు ద్రాక్షారామం నుంచి వచ్చిన చేకూరి, బుల్లి సత్యనారాయణరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి యజ్ఞాలు నిర్వహించేవారు. ఆఖరిరోజు అనంతుని కొండ మెట్ల పంక్తికి దీపోత్సవాన్ని నిర్వహించేవారు. కొంతకాలం ఉత్సవం నిలిచినా..1987లో ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యుల సూచనల మేరకు పునఃప్రారంభించారు.


