News March 29, 2025

IPLలో మొదటి వికెట్ తీసిన కాకినాడ కుర్రాడు

image

IPLలో కాకినాడకు చెందిన సత్యనారాయణరాజు మెయిడెన్ వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రాజు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వికెట్ తీసి పెవిలియన్‌కు పంపించాడు. చివరి ఓవర్లో స్లో బంతులతో ఆకట్టుకోవడంతో కెప్టెన్ హార్దిక్, రోహిత్ శర్మ, కిరాన్ పొలార్డ్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే మరిన్ని మ్యాచుల్లో అతడు రాణించాలని కోరుకుంటున్నారు.

Similar News

News December 2, 2025

కామారెడ్డి జిల్లా ఎన్నికల్లో పెరిగిన ఉత్సాహం!

image

కామారెడ్డి జిల్లాలో రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ ప్రక్రియలో భాగంగా, సోమవారం వరకు సర్పంచ్ స్థానాలకు 434 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు సభ్యుల స్థానాలకు 848 నామినేషన్లు దాఖలయ్యాయి. అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో, జిల్లాలో ఎన్నికల పోరు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

image

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.

News December 2, 2025

వరంగల్: గుర్తులు రెడీ.. నోటా టెన్షన్..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్‌కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్‌ను నిర్ణయించారు. బ్యాలెట్‌లో నోటా చేరడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.