News March 29, 2025

IPLలో మొదటి వికెట్ తీసిన కాకినాడ కుర్రాడు

image

IPLలో కాకినాడకు చెందిన సత్యనారాయణరాజు మెయిడెన్ వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రాజు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వికెట్ తీసి పెవిలియన్‌కు పంపించాడు. చివరి ఓవర్లో స్లో బంతులతో ఆకట్టుకోవడంతో కెప్టెన్ హార్దిక్, రోహిత్ శర్మ, కిరాన్ పొలార్డ్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే మరిన్ని మ్యాచుల్లో అతడు రాణించాలని కోరుకుంటున్నారు.

Similar News

News November 25, 2025

జనగామ: డబుల్ బెడ్ రూంల పరిస్థితి ఏంటి.?

image

జిల్లాలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో వాటిని పంచకపోవడం, కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో కొన్ని గ్రామాల్లో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని పేద కుటుంబాలకు వాటిని పంచి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

News November 25, 2025

ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.

News November 25, 2025

విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్

image

విశాఖకు పర్యాటక రంగంలో తలమానికంగా కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని నగర ప్రజలతో పాటు పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 30 లేదా డిసెంబర్ 1న అధికారికంగా దీనిని ప్రారంభించనున్నారు. విశాఖ ఎంపీ భరత్ చేతుల మీదుగా ఓపెన్ చేస్తారని సమాచారం.