News March 29, 2025

IPLలో మొదటి వికెట్ తీసిన కాకినాడ కుర్రాడు

image

IPLలో కాకినాడకు చెందిన సత్యనారాయణరాజు మెయిడెన్ వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రాజు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వికెట్ తీసి పెవిలియన్‌కు పంపించాడు. చివరి ఓవర్లో స్లో బంతులతో ఆకట్టుకోవడంతో కెప్టెన్ హార్దిక్, రోహిత్ శర్మ, కిరాన్ పొలార్డ్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే మరిన్ని మ్యాచుల్లో అతడు రాణించాలని కోరుకుంటున్నారు.

Similar News

News April 21, 2025

IPL: ముంబై సునాయాస విజయం

image

చెన్నై చాలా కష్టంగా చేసిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్‌మని ఊదేసింది. రోహిత్ హాఫ్ సెంచరీ(76*)తో ఫామ్‌లోకి రాగా అటు సూర్య కూడా తనదైన శైలిలో అర్ధ శతకం(68*) చేయడంతో 16వ ఓవర్లోనే MI టార్గెట్‌ను ఛేదించింది. చెన్నై బౌలర్లలో జడేజాకు మాత్రమే వికెట్ దక్కింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

News April 21, 2025

తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ.. 

image

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.

News April 21, 2025

అరసవల్లిలో పోటేత్తిన భక్తులు..పెద్ద మొత్తంలో ఆదాయం 

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి నేడు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.2,66,700- లు, పూజలు విరాళాల రూపంలో రూ.70,548, ప్రసాదాల రూపంలో రూ.1,38,320 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

error: Content is protected !!