News March 20, 2025

IPL‌కు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం

image

ఉప్పల్ స్టేడియంలో IPL కోసం పనులు కొనసాగుతున్నాయి. లైటింగ్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, వాష్ రూమ్స్ క్లీనింగ్, మంచినీటి సదుపాయంపై ఫోకస్ పెట్టినట్లు HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ తెలిపారు. 600-800 కార్మికులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గత ఐపీఎల్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామన్నారు. ఈ సారి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తున్నామని, స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు జగన్ మోహన్ తెలిపారు.

Similar News

News November 8, 2025

వరంగల్: 24 అంతస్తులకు 24 ఏళ్లు కావాలా..?

image

WGLలో రూ.1200 కోట్లతో 24 అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుత్వం 2021లో శంకుస్థాపన చేసింది. 2 ఏళ్లలో పూర్తిచేసి 12అంతస్తుల్లో 35వైద్య విభాగాల్లో OP, IP సేవల కోసం 2208 పడకలను, 500 మంది వైద్యులు, 1000 మంది స్టాఫ్ నర్సులు, మరో 1000 మంది పారా మెడికల్ వైద్య సిబ్బంది సేవలు అందించేలా నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబర్లో పూర్తి చేయాలని నిర్ణయించినా ఇప్పట్లో పనులు పూర్తయ్యేలా లేవు.

News November 8, 2025

మీ కలలను నెరవేర్చలేకపోతున్నా.. NEET విద్యార్థి సూసైడ్

image

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే NEETలో ఫెయిలైనందుకు UPకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రావత్‌పూర్‌లోని హాస్టల్ గదిలో మహమ్మద్ ఆన్(21) సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నా. మీ కలలను నెరవేర్చలేకపోతున్నాను. నేను చనిపోతున్నా. దీనికి పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News November 8, 2025

పెందుర్తి: అత్తను చంపి ఫైర్ యాక్సిడెంట్‌గా కథ అల్లిన కోడలు

image

పెందుర్తి పీఎస్ పరిధిలో కనకమహాలక్ష్మి అనే మహిళ అగ్ని ప్రమాదంలో మృతిచెందినట్లు సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. దేవుడి గదిలో దీపం పడి మంటలు చెలరేగడంతో తన అత్త చనిపోయినట్లు కోడలు లలితా దేవి పోలీసులకు చెప్పింది. అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా.. పాత గొడవలతో కోడలే అత్తను చంపి ప్రమాదంలో చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసినట్లు తేలిందని సీఐ సతీష్ కుమార్ శనివారం తెలిపారు.