News March 21, 2026
IPLలో గ్రేటెస్ట్ టీమ్ ఇదే: పఠాన్

IPLలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ టీమ్ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ముంబై, చెన్నైలలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే కష్టమే. చెన్నై 2010లో, ముంబై 2013లో తొలిసారి టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. కానీ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్లను అందించడంలో ముంబై ముందు వరుసలో ఉంది. అందులో నలుగురు టీమ్ ఇండియా కెప్టెన్లు ఉన్నారు. అందుకే ముంబై అంటే నాకు గౌరవం’ అని తెలిపారు.
Similar News
News April 14, 2026
భయంకరమైన వ్యసనం.. సొంత రక్తాన్నే ఇంజెక్ట్ చేసుకుంటున్నారు

భోపాల్(MP)లో యువత భయంకర వ్యసనం బారిన పడుతున్నారు. మత్తు కోసం తమ రక్తాన్ని బయటకు తీసి మళ్లీ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. JAN నుంచి ఇలాంటి 5 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీన్ని ‘బ్లడ్ కిక్’ అంటున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, సెప్సిస్, హెపటైటిస్, నరాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం తదితర సమస్యలొస్తాయి. డిప్రెషన్, తనకు తానే గాయపర్చుకునే లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.
News April 14, 2026
సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: పొన్నం

TG: RTC ఉద్యోగులు <<19641755>>సమ్మె నిర్ణయాన్ని<<>> వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని, దీనిపై ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. సమస్యలు చెప్పుకోవడానికి తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
News April 14, 2026
ఇంటర్ ఫలితాలు.. 13 మంది ఆత్మహత్య

తెలంగాణ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు.. సిద్దిపేట, HYD, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, MBNR, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.


