News March 29, 2025

IPL: మరోసారి ముంబై టీంలో కాకినాడ కుర్రాడికి చోటు

image

IPLలో నేడు MI vs GT మ్యాచ్ మరికాసేపట్లో జరుగనుంది. కాకినాడకు చెందిన క్రికెటర్ పీవీ సత్యనారాయణరాజు మరోసారి జాక్ పాట్ కొట్టాడు. అతడికి మరోసారి MI అవకాశం కల్పించింది. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో MI తరఫున తుది జట్టులో అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో సత్యనారాయణ రాజు అద్భుతంగా రాణించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.
*ALL THE BEST సత్యనారాయణ రాజు*

Similar News

News November 19, 2025

నేడు బాపట్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.107.21కోట్లు జమ!

image

బాపట్ల జిల్లాలోని సుమారు 1,60,441 రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ 2వ విడత రూ.5,000, పీఎం కిసాన్ 21వ విడత రూ.2,000 కలిపి మొత్తంగా రూ.7,000లు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి డీఏవో కె.అన్నపూర్ణమ్మ వివరాలను మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లోని రైతులకు రూ.107.21 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు ఆమె తెలిపారు.

News November 19, 2025

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథం: మంత్రి

image

TG: <<18308868>>జిన్నింగ్<<>> మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగించాలన్నారు. మరోవైపు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్ 6.72 నుంచి 10qlకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొబైల్ OTP ఆధారంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.

News November 19, 2025

నాగర్ కర్నూల్: నేడు కబడ్డీ ఎంపికలు

image

NGKL(D) కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి MJP(CBM) కళాశాలలో నేడు కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎం.జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ తెలిపారు. జూనియర్ బాలికలు(31-12-2005) తర్వాత జన్మించి, బరువు 65kgs లోపు, సీనియర్ మహిళలు 75kgs లోపు ఉండాలన్నారు. ఒరిజినల్ బోనోఫైడ్, టెన్త్ మెమో,ఆధార్‌తో హాజరు కావాలన్నారు. వివరాలకు 77803 42434 సంప్రదించాలన్నారు.