News March 18, 2025

IPL మ్యాచ్: HYDలో భారీ బందోబస్తు

image

IPL అభిమానులకు అసౌకర్యం కలగకుండా క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో IPL నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి డీసీపీలు, ఏసీపీలు, హైదరాబాద్ క్రికెట్ ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పల్‌ పరిసరాల్లో పోలీసుల భారీ బందోబస్తు ఉంటుంది.

Similar News

News October 14, 2025

L.C.A-643 మిరప రకం ప్రత్యేకతలు ఇవే

image

పచ్చిమిర్చితో పాటు ఎండు మిర్చికి కూడా అనువైన రకం L.C.A-643. ఈ మిర్చి కాయలు లేత ఆకుపచ్చరంగులో పొడవుగా 13 నుంచి 14 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. కాయలు ఎండిన తర్వాత కూడా కాస్త ముడతపడి ఆకర్షణీయమైన రంగులో ఉంటాయి. ఇది బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. జెమిని వైరస్‌ను కూడా కొంత వరకు తట్టుకుంటుంది. నల్లతామర పురుగు సోకినా కొద్దిపాటి పురుగు మందులను పిచికారీ చేస్తే దీన్ని తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది.

News October 14, 2025

గోదావరిఖని: ‘రుణాలు మంజూరు చేసి సహకరించాలి’

image

స్వశక్తి సంఘాలకు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని రామగుండం ఇన్‌ఛార్జి కమిషనర్‌ జే.అరుణశ్రీ అన్నారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం టీఎల్‌బీసీ సమావేశం జరిగింది. సీనియారిటీ ప్రాతిపదికన స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను మొదటి, 2వ, 3వ విడతలు సకాలంలో మంజూరు చేయాలని ఆమె కోరారు.

News October 14, 2025

మంథని: L మడుగులో పడి ఒకరు మృతి

image

మంథని మండలం ఖాన్‌సాయిపేటకు చెందిన గావిడి సూర్యం ఎల్‌ మడుగులో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రైతు జక్కుల కిషన్‌ పొలానికి సంబంధించి మోటార్‌ చెడిపోయింది. దీంతో ఎల్‌ మడుగులో నుంచి దానిని బయటకు తీసేందుకు గ్రామానికి చెందిన సూర్యం మరో వ్యక్తి గురిసింగా రాజుతో కలిసి అక్కడకు వెళ్లాడు. మోటార్‌ బయటకు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు సూర్యం ఎల్‌ మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు.