News October 31, 2024

IPL: విశాఖ ప్లేయర్‌కు రూ.6కోట్లు

image

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. విశాఖకు చెందిన ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడి ధర కేవలం రూ.20 లక్షలు మాత్రమే.

Similar News

News November 12, 2025

రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం: మంత్రి

image

విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే CII 30వ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి మేలు చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 30 మంది విదేశీ మంత్రులు పాల్గొననున్నారని చెప్పారు. మొత్తం 410 ఒప్పందాల ద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.

News November 11, 2025

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7రోజుల జైలు శిక్ష: SP

image

జామి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి స్కూటీ నడిపిన కొట్టాం గ్రామానికి చెందిన నక్కెళ్ల ఎర్రినాయుడుకు కోర్టు 7రోజులు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 9న విసినిగిరి జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో మద్యం తాగి స్కూటీ నడిపిన నిందితుడిని జామి పోలీసులు పట్టుకున్నారు. సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచిన తరువాత శిక్ష ఖరారైందన్నారు.

News November 11, 2025

సీఎం స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను: రామ్మోహన్‌రావు

image

నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి పెట్టుబడిదారుడిగా ఎదిగానని పారిశ్రామికవేత్త రామ్మోహన్‌రావు తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన CMతో వర్చువల్‌గా మాట్లాడారు. 2017 CIIసదస్సులో CM సమక్షంలో MOU కుదిరిందని, అప్పటి నుంచి చంద్రబాబు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 5 వేల మంది రైతులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.