News November 24, 2024
IPL వేలానికి చిత్తూరు కుర్రాడు..!

మొట్టమొదటి సారిగా IPL వేలం పాటలోకి ఉ.చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారుడు గిరీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లెకి చెందిన ఈయన SVUలో బీటెక్ పూర్తిచేశాడు. క్రికెట్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయన IPL వేలంపాటలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఇవాళ లేదా రేపు తెలియనుంది. ఏ టీం సెలక్ట్ చేసుకుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 30, 2025
చిత్తూరు: సిబ్బంది అందుబాటులో ఉండాలి

తుఫాను నేపథ్యంలో సిబ్బంది అందరూ ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. 14 మండలాలలో 168 గ్రామాలలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
News November 30, 2025
ముత్తుకూరు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్ద పంజాణి మండలం ముత్తుకూరు క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ముత్తుకూరు నుంచి బైక్పై వస్తున్న అంజి అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 30, 2025
రూ.250 కోట్ల ఆదాయం.. బాలాజీ డివిజన్ ఇంకెప్పుడు.?

IND రైల్వేకు ఏటా రూ.250 కోట్ల ఆదాయానిచ్చే తిరుపతి RS <<18428153>>ప్రత్యేక డివిజన్<<>> ఏర్పాటుకు ఆమడ దూరంలో ఉంది. ఈ స్టేషన్ గుంతకల్ డివిజన్కు 320, విశాఖ జోన్కు 736 కి.మీ దూరంలో ఉంది. దీంతో పాలనాపరమైన ఇబ్బందులతో 1990 నుంచి బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ ఊపదుకుంది. డివిజన్ లేకపోవడంతో TPT–తిరుచానూరు–చంద్రగిరి కారిడార్ అభివృద్ధి, గూడూరు డబుల్లైన్, కాట్పాడి ఎలక్ట్రిఫికేషన్ వంటి ప్రాజెక్టులు నెమ్మదించాయట.


