News April 25, 2024
IPL: హైదరాబాదీలకు గుడ్న్యూస్

రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా SRH VS RCB ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఫ్యాన్స్ కోసం మెట్రో, TSRTC అధికారులు అదనపు సర్వీసులు నడుపుతున్నారు. రేపు అర్ధరాత్రి 12:15 వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. మెహదీపట్నం, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, కోఠి, అఫ్జల్గంజ్, లక్డీకపూల్, దిల్సుఖ్నగర్, జీడిమెట్ల, JBS, పాతబస్తీ తదితర ఏరియాల నుంచి స్టేడియానికి మొత్తం 24 రూట్లలో RTC సర్వీసులు ఉంటాయి. సద్వినియోగం చేసుకోండి.
SHARE IT
Similar News
News November 23, 2025
నగరానికి CC శాపం.. బడ్జెట్కు భారం!

పెండింగ్ పనుల్లో సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్ల వాటా ఊహించని విధంగా ఉంది. ఈ కీలకమైన పనుల్లో జాప్యం వల్లే మొత్తం ఆర్థిక భారం పెరిగిపోయింది: 1,952 CC రోడ్ల పనులు పూర్తి కావాల్సి ఉంది. <<18363524>>వీటి అంచనా వ్యయం<<>> రూ.54,384.26 లక్షలు (సుమారు ₹543 కోట్లు). కేవలం 110 BT పనులకే రూ.6,419.91 లక్షలు పెండింగ్ ఉంది. మొత్తం రూ.608 కోట్ల పెండింగ్లో రూ.543 కోట్లు సీసీ రోడ్లకే కావడం గమనార్హం.
News November 22, 2025
తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత నర్సింహా రెడ్డి, చేవెళ్ల నుంచి భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.
News November 22, 2025
తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత నర్సింహా రెడ్డి, చేవెళ్ల నుంచి భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.


