News April 6, 2025
IPL: హైదరాబాద్లో ట్రాఫిక్ అలర్ట్

ఈ రోజు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుండగా రాచకొండ సీపీ సుధీర్ బాబు ట్రాఫిక్ అలర్టు జారీ చేశారు. రామంతపూర్ నుంచి ఉప్పల్ వెళ్లేవారు హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8 మీదుగా, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ బోడుప్పల్ వెళ్లేవారు వయా నాగోల్ మెట్రో, ఉప్పల్ HMDA భగాయత్ మీదుగా, తార్నాక నుంచి ఉప్పల్ వెళ్లేవారు హబ్సిగూడ క్రాస్ నుంచి నాచారం మీదుగా వెళ్లాలని సూచించారు.
Similar News
News April 16, 2025
పెద్దపల్లి: ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పెద్దపల్లి జిల్లాలో యాసంగి పంట ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. నాణ్యమైన పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు. సన్న రకం ధాన్యానికి క్వింటాల్ రూ.500 బోనస్ సైతం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు అంశంలో ఎలాంటి ఫిర్యాదులు, సమస్యలు ఉన్న 7995050780, 08728-224045 కాల్ చేయాలన్నారు.
News April 16, 2025
Caratlane ఫ్రాంచైజీతో జ్యువెల్లరీ రంగంలోకి ‘కమల్ వాచ్’

కమల్ వాచ్ కంపనీ జ్యువెల్లరీ రంగంలో అడుగుపెడుతూ హైదారాబాద్ గచ్చిబౌలిలో మొదటి Caratlane ఫ్రాంచైజీని టోట్ల ఫ్యామిలీతో కలిసి ప్రేమలతా భాయ్ టోట్ల ప్రారంభించారు. గచ్చిబౌలిలో గూగుల్ కార్యాలయం ఎదురుగా ఈ మొట్టమొదటి నూతన షోరూమ్ను కమల్ వాచ్ ఏర్పాటు చేసింది. ఐదు రాష్ట్రాలలో 56 వాచ్ స్టోర్లు, Swarovski అవుట్లెట్లు మరియు లగేజ్ స్టోర్లతో పాటు ఈ కొత్త ప్రారంభంతో తమ వ్యాపారంలో వైవిధ్యతను ప్రకటించారు.
News April 16, 2025
మహబూబ్నగర్: ‘ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టాలి’

పోలీసులు ప్రతి కేసును కూడా పారదర్శకంగా విచారణ చేపట్టాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సర్కిళ్ల వారీగా నమోదైన నేరాల విషయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిందితులకు శిక్ష శాతాన్ని పెంచేందుకు పగడ్బందీగా విచారణ చేపట్టాలన్నారు. విచారణ జరగకుండా నిలిచిపోయిన కేసుల గురించి ఎస్పీ ఆరా తీసి కారణాలు అడిగి తెలుసుకున్నారు.