News March 22, 2025

IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

image

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నారు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.

Similar News

News March 22, 2025

RCBvsKKR: ఆటగాళ్లు వీరే

image

ఐపీఎల్ 2025 ఓపెనింగ్ గేమ్‌ కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. కాగా ఓపెనింగ్ సెర్మనీ వల్ల టాస్ ఆలస్యంగా పడింది. RCB: సాల్ట్, కోహ్లీ, పాటిదార్ (C), లివింగ్‌స్టోన్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్, రసిక్ దార్, హేజిల్‌వుడ్, దయాల్, సుయాష్. KKR: నరైన్, డికాక్, రహానే (C), అయ్యర్, రఘువంశీ, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, జాన్సన్, హర్షిత్, వరుణ్.

News March 22, 2025

జగిత్యాల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

image

జగిత్యాల జిల్లాలో శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు. అత్యధికంగా పెగడపల్లి మండలంలో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. బుగ్గారం మండలం సిరికొండలో 39.3, పొలాసలో 35, గొల్లపల్లి 33.3, వెలగటూర్ లో 32.8, మల్యాలలో 23, జగిత్యాలలో 12 కథలాపూర్లో 8.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News March 22, 2025

కేంద్ర నిధులు రాబట్టండి.. అధికారులతో సీఎం

image

AP: కేంద్ర ప్రాయోజిత పథకాలు, రావాల్సిన నిధులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐదు కేంద్ర శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని అధికారులు చెప్పగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాబట్టాలని ఆదేశించారు. కేంద్రం అడిగిన సమగ్ర సమాచారాన్ని అందించి నిధులు విడుదలయ్యేలా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించారు.

error: Content is protected !!