News March 22, 2025

IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

image

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నాడు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.

Similar News

News March 22, 2025

RJY: రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు

image

సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్, అసభ్యకరమైన, అనైతిక, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు ఉన్నాయని గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఏ విధమైన పోస్ట్లు పెట్టొద్దని ఎస్పీ హితవు పలికారు.

News March 22, 2025

రాజానగరం: సేద్యపు నీటి కుంటను ప్రారంభించిన కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (NREGS)ద్వారా సేద్యపు నీటి కుంటను జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి కొబ్బరికాయ కొట్టి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తోకాడ గ్రామం నుంచే మొట్టమొదటిగా ఇంకుడు గుంట కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆమె అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులైన నీటిని ఒడిసిపెట్టి, దాచి నట్లయితే రాబోయే తరాలవారికి మంచి తాగునీటిని అందించగలమని అన్నారు.

News March 22, 2025

తూ.గో: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

image

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.

error: Content is protected !!