News March 22, 2025
IPL-2025: డూడుల్ మార్చిన గూగుల్

అతిపెద్ద ఫ్రాంచైజ్ క్రికెట్ పండుగ IPL ఈ రోజు ప్రారంభం కానుండటంతో ‘గూగుల్’ ప్రత్యేక డూడుల్ని ఆవిష్కరించింది. డూడుల్ను క్రికెట్ పిచ్గా మార్చేసి, రెండు డక్స్ ఆడుతున్నట్లు చూపించింది. కాగా, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు KKR, RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ జట్ల మధ్య ఇప్పటివరకు 34 మ్యాచులు జరగ్గా KKR 20, RCB 14 మ్యాచ్లు గెలిచాయి. నేటి మ్యాచ్లో గెలుపెవరిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News March 22, 2025
IPL: ఈసారైనా వీరికి టైటిల్ దక్కేనా?

ఐపీఎల్లో కొన్ని జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. వాటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG ఉన్నాయి. ఈ సారైనా తమ ఫేవరెట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ నేటి నుంచి మే 25 వరకు కొనసాగనుంది. 64 రోజులపాటు 74 మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుతం టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి.
News March 22, 2025
ALERT: రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA తెలిపింది. మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని పేర్కొంది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇవాళ అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.
News March 22, 2025
రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ

AP: విశాఖ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ను పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని కలెక్టర్కు సంస్థ ప్రతినిధులు అందించారు. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఆ హోదాను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీచ్లో సౌకర్యాలను కల్పించింది.