News April 21, 2025

IPL 2025: 400+ రన్స్ చేసిన సాయి సుదర్శన్

image

గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లోనూ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. KKRతో జరుగుతున్న మ్యాచుతో అర్ధసెంచరీ చేసిన ఆయన IPL 2025లో 400కి పైగా పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 8 మ్యాచుల్లో వరుసగా 74, 63, 49, 5, 82, 56, 36, 52 పరుగులు చేశారు.

Similar News

News August 7, 2025

120 డిగ్రీలు చేసిన విద్యావేత్త కన్నుమూత

image

AP: 120 డిగ్రీలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యావేత్త డా.పట్నాల జాన్ సుధాకర్ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. విశాఖ (D) పెందుర్తి (M) పెదగాడిలో జన్మించిన ఆయన తొలుత CBIలో చిన్న ఉద్యోగం చేశారు. తర్వాత సివిల్స్‌కు ఎంపికయ్యారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనపు డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఉద్యోగాలు చేస్తూనే డిగ్రీలు పూర్తి చేశారు.

News August 7, 2025

సెప్టెంబర్ 1 నుంచి జీతాల పెంపు: TCS

image

తమ ఉద్యోగులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1 నుంచి జీతాలు పెంచబోతున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం మెయిల్స్ పంపుతోంది. 80 శాతం ఉద్యోగులకు హైక్ వస్తుందని.. మిడ్, జూనియర్ లెవల్స్ ఇందులో కవర్ అవుతారని పేర్కొంది. కాగా 12 వేల మంది ఉద్యోగులకు తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజులకే TCS ఈ ప్రకటన చేయడం గమనార్హం.

News August 7, 2025

స్కూళ్లకు వరుస సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఏపీలో ఈ నెల 8న స్కూళ్లకు సెలవు ఉండగా, TGలో ఆప్షనల్ హాలిడే. 9న రెండో శనివారం, ఆగస్టు 10న ఆదివారం సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. ఆ తర్వాతి వారంలోనూ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం(హాఫ్ డే స్కూలు), 16న కృష్ణ జన్మాష్టమి, 17న ఆదివారం కావడంతో వరుస సెలవులు ఉంటాయి.