News March 31, 2024
IPL: క్రికెట్ అభిమానులారా జాగ్రత్త
నకిలీ IPL టిక్కెట్లతో సైబర్ మోసగాళ్లు దోచేస్తున్నారు.. జాగ్రత్త. ఏప్రిల్ 5న హైదరాబాద్లో జరిగే సన్రైజర్స్, చెన్నై మ్యాచ్ టికెట్లు పేటీఎంలో విక్రయించగా అమ్ముడైపోయాయి. అయితే ఇంకా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయంటూ నేరగాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రూ.1000 పంపితే టికెట్ పంపిస్తామని.. ఆ తర్వాత మిగిలిన డబ్బు చెల్లించాలని చెబుతున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News October 6, 2024
ఇవాళ పాకిస్థాన్తో భారత్ పోరు
ఇవాళ మహిళా టీ20 ప్రపంచకప్లో ఆసక్తికర పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. తొలి మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో ఓటమితో భారత్కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 టీ20లు జరగ్గా భారత్ 12, పాక్ 3 మ్యాచుల్లో విజయం సాధించాయి. కాగా మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్లో ప్రసారం కానుంది.
News October 6, 2024
నేడు సింహవాహనంపై ఊరేగనున్న స్వామివారు
AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ ఉ.8 నుంచి 10 గంటల వరకు స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారు. రా.7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంలో వేణుగోపాలుడి అలంకారంలో ఊరేగనున్నారు.
News October 6, 2024
మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే
ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని CAIT అంచనా వేస్తోంది.