News April 30, 2024

IPL: ప్లేఆఫ్స్‌కు ఇంగ్లండ్ ప్లేయర్లు దూరం

image

IPLలో పలు జట్లకు బిగ్ షాక్ తగలనుంది. ప్లేఆఫ్స్‌కు ఇంగ్లండ్ ప్లేయర్లు దూరం కానున్నారు. మే 22 నుంచి ఇంగ్లండ్ టీమ్ పాక్‌తో నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది. WCకు ఎంపిక చేసిన జట్టునే ఆ పర్యటనకు సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న బట్లర్, సాల్ట్, మొయిన్ అలీ, బెయిర్‌స్టో, జాక్స్, కరన్, టాప్లే, లివింగ్‌స్టోన్ ఆ సిరీస్ కోసం వెళ్లనున్నారు. మరోవైపు మే 21 నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి.

Similar News

News February 6, 2026

KCRపై రేవంత్ విషం చిమ్ముతున్నాడు: KTR

image

TG: వైఫల్యాన్ని, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి KCR వ్యక్తిత్వంపై CM రేవంత్ విషం చిమ్ముతున్నారని KTR అన్నారు. ‘ఇది తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడి. రేవంత్ తిట్ల ట్రాప్‌లో పడకండి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. కానీ రేవంత్ తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నాడు. ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రజల తీర్పే KCRకు ఇచ్చే అసలైన గౌరవం’ అని Xలో పోస్ట్ చేశారు.

News February 6, 2026

దోష నివారణకు దివ్య మార్గం ‘సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం’

image

జాతకంలో కుజ, సర్ప, రాహు-కేతు దోషాలతో బాధ పడుతున్నారా? వివాహంలో ఆటంకాలా? అయితే మీకు సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం అత్యుత్తమ మార్గం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ కల్యాణం, హోమంతో కుటుంబంలో శాంతి, వివాహ సౌఖ్యం, ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. ఈ పూజ పూర్తి వీడియో రికార్డింగ్‌ను 24 గంటల్లో వాట్సాప్ ద్వారా పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో జరిపించే ఈ పూజను వేద్‌మందిర్‌లో ఇప్పుడే <>బుక్ చేసుకోండి<<>>.

News February 6, 2026

హీరో విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్

image

యాక్టర్, TVK అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను సింగిల్ బెంచ్ కొట్టేసింది. 2015-16లో రూ.15కోట్ల ఆదాయానికి సంబంధించి పన్ను చెల్లించని కారణంగా రూ.1.50కోట్లు ఫైన్ కట్టాలని ఐటీ శాఖ నోటీసులిచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన CJ ధర్మాసనం జనవరి 23న తీర్పు రిజర్వ్ చేశారు. తాజాగా ఆ ఫైన్ కట్టాల్సిందేనని తీర్పునిచ్చారు.