News May 26, 2024

మరికాసేపట్లో IPL ఫైనల్.. వాతావరణం ఎలా ఉందంటే?

image

కాసేపట్లో కేకేఆర్, SRH మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చెన్నై చెపాక్ స్టేడియంలో వర్షం కురిసే అవకాశం తక్కువేనని అక్యూవెదర్ తెలిపింది. కాగా నిన్న ఇదే సమయానికి స్టేడియంలో వర్షం కురిసింది. ఒకవేళ ఇవాళ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా స్టేడియానికి తరలివస్తున్నారు.

Similar News

News October 28, 2025

NOV 1 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్

image

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న పొల్యూషన్‌ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. NOV 1 నుంచి నగరంలో BS-4, BS-5 డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. BS-6 డీజిల్ వాహనాలను మాత్రమే అనుమతించనుంది. దీన్ని సక్రమంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ రూల్‌ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు వేయాలంది. అన్ని మేజర్ ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

News October 28, 2025

రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు: కవిత

image

TG: మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, ఆయనను ప్రజలు క్షమించరని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ‘జనంబాట’లో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివెన రిజర్వాయర్‌ను ఆమె పరిశీలించారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80% పూర్తయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఫైరయ్యారు.

News October 28, 2025

2 రాష్ట్రాల్లో ఓట్లు… పీకేకు EC నోటీసులు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్‌కు EC నోటీసులు జారీ చేసింది. ఆయనకు 2 రాష్ట్రాల్లో ఓటు ఉండడమే దీనికి కారణం. పీకే WBలో ఓటరుగా ఉన్నారు. తర్వాత కర్గహార్ (బిహార్) నియోజకవర్గ ఓటరుగా నమోదు అయ్యారు. రెండు చోట్ల ఓట్లుండటాన్ని గుర్తించిన EC వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చింది. అయితే బిహార్‌లో ఓటరుగా నమోదయ్యాక WB ఓటును తొలగించాలని PK అప్లై చేశారని ఆయన టీమ్ సభ్యులు తెలిపారు.