News March 24, 2024
చెన్నైలో ఐపీఎల్ ఫైనల్?
ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరిగే ఛాన్స్ ఉంది. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ తయారు చేసిందని బోర్డు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతానికి తొలి 21 మ్యాచులకు మాత్రమే షెడ్యూల్ విడుదలైంది. తాజాగా మిగిలిన షెడ్యూల్ను కూడా రూపొందించారని, మే 26న చెన్నైలో ఫైనల్ జరిగేలా నిర్ణయించినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. ఇక గుజరాత్ స్టేడియంలో క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచులను జరపనున్నారని తెలిపారు.
Similar News
News October 2, 2024
శ్రీదత్త సభా మండపాన్ని ప్రారంభించిన సీఎం
TG: దుండిగల్లోని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో నిర్మించిన శ్రీదత్త సభా మండపాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ‘ఏ రాష్ట్రంలోనైతే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు సురక్షితంగా భవిష్యత్తు తరాలకు అందించేవాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తా’ అని సీఎం అన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలంగాణకు వచ్చినందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు.
News October 2, 2024
గాయమంటూ కథనాలు: వార్తాసంస్థలపై షమీ ఆగ్రహం
తనకు గాయం తిరగబెట్టిందంటూ కథనాలు ప్రచురించిన వార్తాసంస్థలపై టీమ్ ఇండియా బౌలర్ మహ్మద్ షమీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను కోలుకుని తిరిగి ఆడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నేను ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడట్లేదని బీసీసీఐ గానీ నేనుగానీ చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి మీకీ వార్తలు? నా తరఫున ప్రకటన లేకుండా ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ప్రజల్ని కోరుతున్నా’ అని విజ్ఞప్తి చేశారు.
News October 2, 2024
సురేఖ కామెంట్స్పై రేవంత్ ఎలా స్పందిస్తారో?
TG: చైతూ-సామ్ విడాకులు, KTR, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ <<14254371>>కామెంట్స్<<>> రచ్చకు దారితీశాయి. వీటిపై నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని సురేఖకు KTR లీగల్ నోటీసులు పంపారు. అయితే మంత్రి కామెంట్స్పై CM రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా స్పందించలేదు. ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. సురేఖను మందలించి, ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.