News March 26, 2024

IPL: నేడు చెన్నైతో గుజరాత్ ఢీ

image

ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. కాగా.. ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీమ్‌లే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేక రుతురాజ్ సేనపై గుజరాత్ పైచేయి సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News

News March 5, 2026

ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: మోదీ

image

దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం ముఖ్యమని PM మోదీ చెప్పారు. రష్యాvsఉక్రెయిన్, US-ఇజ్రాయెల్vsఇరాన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ.. ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. ఢిల్లీలో ఫిన్‌లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.

News March 5, 2026

ఇరాన్ సంచలన ప్రకటన.. భారత్‌కు గుడ్‌న్యూస్!

image

హార్ముజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో INDతో పాటు మరికొన్ని దేశాలకు భారీ ఊరట లభించింది. త్వరలోనే మన షిప్స్ రవాణా మొదలవ్వొచ్చు. ఇక తమ నౌకాదళంతో హార్ముజ్‌లోని వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. జలసంధిని నియంత్రించే అధికారం తమకుందని, US, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పింది.

News March 5, 2026

జగన్ క్రిస్టియనా, కాదా? అచ్చెన్న వ్యాఖ్యలతో సభలో దుమారం

image

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇవాళ కూడా శాసనమండలిని కుదిపేస్తోంది. జగన్ క్రిస్టియనా కాదా? అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నిన్న కూడా సభలో తాను ప్రశ్నించానని, 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అచ్చెన్న కామెంట్స్‌ను వ్యతిరేకిస్తూ YCP సభ్యులు నినాదాలతో ఆందోళనకు దిగారు. ఈ గందరగోళంతో ఛైర్మన్ మోషేన్ రాజు సభను 5 నిమిషాలు వాయిదా వేశారు.