News October 25, 2024
IPL: అత్యధిక జట్లకు ఆడిన ప్లేయర్ ఇతడే

ఐపీఎల్లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఏకంగా 9 జట్లకు ప్రాతినిధ్యం వహించారు. RR, DC, PWI, SRH, MI, GL, PBKS, RCB, KKR జట్లకు ఆయన ఆడారు. ఆయన తర్వాత జయదేవ్ ఉనద్కత్ (8) ఉన్నారు. ఉనద్కత్ KKR, RCB, DC, RPS, RR, MI, LSG, SRH జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మనీశ్ పాండే, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, తిసారా పెరీరా, ఇషాంత్ శర్మ, పార్థివ్ పటేల్ 6 జట్లకు ఆడారు.
Similar News
News March 17, 2025
బైడెన్ క్షమాభిక్ష నిర్ణయాలు రద్దు: ట్రంప్

US అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు జో బైడెన్ తన సోదరులు, సోదరితో పాటు పలువురికి ప్రసాదించిన క్షమాభిక్షలు చెల్లవని ట్రంప్ ప్రకటించారు. ఆ ఆదేశాలపై బైడెన్ ఆటోపెన్తో సంతకాలు చేశారని, ఆయనకు తెలియకుండా కొందరు ఆ వ్యవహారాన్ని నడిపారన్నారు. ఈ నేరానికి పాల్పడిన వారే తనపై రెండేళ్లపాటు జరిగిన తప్పుడు దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలను నాశనం చేశారని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.
News March 17, 2025
భాషపై లేనిపోని రాజకీయాలు చేయం: CBN

AP: భాష కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం రాదని CM చంద్రబాబు అన్నారు. ‘మాతృభాషతోనే విజ్ఞానం వస్తుంది. భాషపై లేనిపోని రాజకీయాలు చేయం. బతుకుదెరువుకు ఎన్ని భాషలైనా నేర్చుకుంటాం. కానీ మాతృభాషను మరిచిపోకూడదు’ అని తెలిపారు. మరోవైపు, ధ్వంసమైన రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టామన్నారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడం ఖాయమని వివరించారు.
News March 17, 2025
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయను: హర్ష సాయి

ఇకపై బెట్టింగ్ యాప్స్ను తాను ప్రమోట్ చేయనని ప్రముఖ యూట్యూబర్ <<15777784>>హర్షసాయి<<>> అన్నారు. బెట్టింగ్ మూలాలపై అందరం కలిసి పోరాడదామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందెన్నడూ తాను చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేయలేదని తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా వీసీ సజ్జనార్ సూచనల మేరకు హర్షసాయిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.