News October 25, 2024
IPL: అత్యధిక జట్లకు ఆడిన ప్లేయర్ ఇతడే
ఐపీఎల్లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఏకంగా 9 జట్లకు ప్రాతినిధ్యం వహించారు. RR, DC, PWI, SRH, MI, GL, PBKS, RCB, KKR జట్లకు ఆయన ఆడారు. ఆయన తర్వాత జయదేవ్ ఉనద్కత్ (8) ఉన్నారు. ఉనద్కత్ KKR, RCB, DC, RPS, RR, MI, LSG, SRH జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మనీశ్ పాండే, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, తిసారా పెరీరా, ఇషాంత్ శర్మ, పార్థివ్ పటేల్ 6 జట్లకు ఆడారు.
Similar News
News October 25, 2024
మరో 1,000 పాయింట్లు నష్టపోయే ప్రమాదం!
టెక్నికల్ అనాలసిస్ ప్రకారం నిఫ్టీ-50 మరో 1,000 పాయింట్లు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆల్ టైం హై 26,277 నుంచి నెల కంటే తక్కువ వ్యవధిలోనే 7% (1,899 పాయింట్లు) నష్టపోయిన సూచీ 100 డే మూవింగ్ యావరేజ్(DMA- 24,565) కింద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న 24,399 స్థాయి నుంచి మార్కెట్ పుంజుకోలేకపోతే 23,365 (200 DMA)కి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
News October 25, 2024
ఇళ్లు కూల్చడం దేనికి? ఆ పనులు చేయండి చాలు: ఈటల
TG: మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ‘అసలు DPR లేకుండా మార్కింగ్ ఎలా చేస్తారు. చెరువులు శుభ్రం చేసి, డ్రైనేజీ నీరు మూసీలో కలవకుండా చూడండి. అంతేకానీ పేదల ఇళ్లు కూల్చడం దేనికి? గత ప్రభుత్వం సచివాలయాన్ని బఫర్ జోన్లో కట్టలేదా? పేదల ఉసురు మంచిదికాదు. కూల్చివేతలకు ఉపక్రమిస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం’ అని హెచ్చరించారు.
News October 25, 2024
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ
TG: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీనికి మంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్గా వ్యవహరిస్తారు. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉండనుండగా ప్రత్యేక ఆహ్వానితుడిగా కే.కేశవరావుని నియమించారు. శాఖల వారీగా ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో సబ్ కమిటీ భేటీ కానుంది. కాగా ఇవాళ సాయంత్రంలోపు పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీనిచ్చారు.