News October 25, 2024

IPL: అత్యధిక జట్లకు ఆడిన ప్లేయర్ ఇతడే

image

ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఏకంగా 9 జట్లకు ప్రాతినిధ్యం వహించారు. RR, DC, PWI, SRH, MI, GL, PBKS, RCB, KKR జట్లకు ఆయన ఆడారు. ఆయన తర్వాత జయదేవ్ ఉనద్కత్ (8) ఉన్నారు. ఉనద్కత్ KKR, RCB, DC, RPS, RR, MI, LSG, SRH జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మనీశ్ పాండే, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, తిసారా పెరీరా, ఇషాంత్ శర్మ, పార్థివ్ పటేల్ 6 జట్లకు ఆడారు.

Similar News

News March 17, 2025

11 మంది సెలబ్రిటీలపై కేసులు

image

TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్ రాజు, అజయ్‌పై కేసులు నమోదయ్యాయి.

News March 17, 2025

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 17, 2025

ఉగాది నుంచి పీ4 విధానం అమలు: సీఎం చంద్రబాబు

image

AP: ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు అన్నారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తామని తెలిపారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని వివరించారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలు కావాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి APలో 2020 విజన్ వల్ల చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగిందని చెప్పారు.

error: Content is protected !!