News November 24, 2024
IPL: రిషభ్ పంత్కు రూ.27 కోట్లు

అందరూ అనుకున్నట్లుగానే రిషభ్ పంత్ అదరగొట్టారు. ఈ యువ సంచలనాన్ని రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. RTM పద్ధతిలో ఢిల్లీ దక్కించుకునేందుకు ప్రయత్నించినా లక్నో తగ్గలేదు. IPL చరిత్రలో ఇదే అత్యధిక ధర. ఇదే వేలంలో శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు పలకగా ఆ రికార్డును పంత్ బద్దలుకొట్టారు.
Similar News
News November 8, 2025
ప్రీటెర్మ్ బర్త్కు ఇదే కారణం

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 8, 2025
ఈరోజు మీకు సెలవు ఉందా?

AP: మొంథా తుఫాను సమయంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలని DEOలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నేడు విశాఖ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. కర్నూలు, నంద్యాల, NTR, కడప, ప.గో, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరి మీ ప్రాంతంలో స్కూల్ ఉందా? COMMENT
News November 8, 2025
శ్రీవారి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందంటే..?

తిరుమల శ్రీవారి ఆలయంలో తొలి సేవ ‘సుప్రభాతం’. ఇది ఉ.3 గంటలకు జరుగుతుంది. స్వామివారిని మేల్కొలిపే దివ్య ఘట్టమిది. పవిత్ర మంత్రాలు, శ్లోకాలు, మధుర నాదాలతో అర్చకులు స్వామివారిని నిదురలేపి, నిత్య కైంకర్యాలకు ఆహ్వానిస్తారు. ఈ సేవతోనే రోజు ప్రారంభమవుతుంది. ఈ సేవకు ఎంపికైన భక్తులకు స్వామివారిని <<17956589>>అతి దగ్గరి నుంచి<<>>(10Ft) దర్శించుకునే మహాభాగ్యం లభిస్తుంది. ☞ మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


