News September 26, 2024

IPL: ధోనీకి లైన్ క్లియర్ అయినట్లేనా?

image

ఐపీఎల్ మెగా వేలానికి ముందు బీసీసీఐ ఐదుగురికి రిటెన్షన్ అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్‌ కూడా ఆడనున్నారు. ఇప్పటివరకు ఆ జట్టు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీశ పతిరణ, శివం దూబేలను అట్టిపెట్టుకోవాలని భావించింది. ఇప్పుడు ఐదుగురికి అనుమతి లభిస్తుండడంతో ధోనీని కూడా కచ్చితంగా రిటైన్ చేసుకోవచ్చని సమాచారం.

Similar News

News October 15, 2025

మేడిగడ్డ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు

image

TG: వరదల్లో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. పునరుద్ధరణ ప్లాన్, డిజైన్లకోసం బిడ్ల దాఖలు నేటితో ముగియనుంది. HYD, మద్రాస్, రూర్కీ IITలు టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా బిడ్లు వేసేందుకు రెడీగా ఉండడంతో గడువు పొడిగించడంపై ఆలోచిస్తోంది. NDSA సిఫార్సులకు అనుగుణంగా ఉన్న బిడ్‌ను ఆమోదించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది.

News October 15, 2025

మొక్కజొన్న: కోతకు ముందు ఈ జాగ్రత్తలు..

image

మనుషులతోపాటు కోళ్లు, పశువులకు ఆహారం ఉపయోగించే ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి. పంటను ఆశించే కాండం తొలుచు పురుగు, పేను బంక నివారణకు రైతులు పలు మందులను వాడుతుంటారు. అయితే కోత దగ్గర పడిన సమయంలో అనుమతికి మించి, సురక్షిత కాలాన్ని దాటి వాడటం మంచిది కాదు. వాడితే పంట ద్వారా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే పైన ఫొటోలో చూపినట్లుగా సురక్షిత కాలం, మోతాదును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News October 15, 2025

అమ్మానాన్నా.. ఎందుకిలా చేస్తున్నారు!

image

కనిపెంచిన తల్లిదండ్రులే కన్నబిడ్డల ఊపిరి తీస్తున్నారు. కారణమేదైనా.. కాస్తయినా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. TG, APలో జరిగిన 2 సంఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిన్న HYDలో భర్తతో గొడవ కారణంగా భార్య సాయిలక్ష్మి రెండేళ్ల ఇద్దరు కవలలను చంపేసింది. అనంతరం తానూ బిల్డింగ్‌పై నుంచి దూకి తనువు చాలించింది. ఇవాళ కోనసీమ(D) చిలకలపాడులో భర్త కామరాజు ఇద్దరు పిల్లలను చంపి, బలవన్మరణానికి పాల్పడ్డాడు.