News November 28, 2024

IPL: జితేశ్ శర్మ హైక్ 5,400 శాతం..!

image

ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును టీమ్ ఇండియా ప్లేయర్ జితేశ్ శర్మ అందుకున్నారు. వేలంలో ఆయన తన పాత ధర కంటే 5,400% ఎక్కువ పలికారు. 2024లో ఆయన రూ.20 లక్షలకే పంజాబ్ తరఫున ఆడారు. ఈ వేలంలో ఏకంగా రూ.11 కోట్లతో తన పంట పండించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో శాలరీ హైక్ సాధించిన ప్లేయర్ మరొకరు లేరు. వికెట్ కీపింగ్ నైపుణ్యం, లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా మంచి పేరుండటంతో RCB అతడిని కొనేసింది.

Similar News

News April 1, 2026

అకౌంట్‌లో ₹44, చేతిలో ₹40.. బరిలో 26ఏళ్ల అమ్మాయి!

image

కేరళంలోని ఎట్టుమనూర్‌లో ఆశ్నా థంపి అనే 26ఏళ్ల జర్నలిస్ట్ ఎన్నికల బరిలోకి దిగడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తనకు ఆస్తులేం లేవని.. ₹40 క్యాష్, బ్యాంక్ అకౌంట్‌లో ₹44 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనడమే ఇందుకు కారణం. SUCI(C) పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె కేరళం ఎన్నికల బరిలో ఉన్న అత్యంత పేద అభ్యర్థిగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమని ఆశ్నా చెబుతున్నారు. <<-se>>#Elections2026<<>>

News April 1, 2026

‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చిందంటే?

image

ఏటా ఏప్రిల్ 1న ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఫూల్స్ చేయడం చూస్తుంటాం. అయితే దీని వెనుక ఓ ఆసక్తికరమైన రూమర్ ఉంది. 1582లో ఫ్రాన్స్ తన క్యాలెండర్‌ను మార్చినప్పుడు కొత్త సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుందని ప్రకటించింది. అయితే ఈ మార్పు తెలియక APR 1నే వేడుకలు చేసుకున్న వారిని అందరూ ‘ఫూల్స్’ అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఈ ఏప్రిల్ ఫూల్ ప్రారంభమైందట. ఏదో ఒక సమయంలో మీరూ ఏప్రిల్ ఫూల్ అయ్యే ఉంటారు కదూ. COMMENT

News April 1, 2026

నయన్ సెన్సేషన్.. ఒకేసారి 5 భాషల్లో!

image

నటి నయనతార ఒకేసారి 5 భాషల్లో అగ్ర హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ షూటింగ్ దశలో ఉండగా తమిళ్‌లో 2 చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. మరొకటి షూటింగ్ జరుపుకుంటోంది. మలయాళంలో 2 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. కన్నడలో నయన్ యాక్ట్ చేసిన టాక్సిక్ రిలీజ్‌కు సిద్ధమైంది. అటు బాలీవుడ్‌లో ఇప్పటికే షారుఖ్‌తో నటించిన ఆమె తాజాగా సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.