News March 22, 2025
IPL: ఆర్సీబీపై KKRదే డామినేషన్

నేటి నుంచి 65 రోజుల పాటు ఐపీఎల్ 2025 జరగనుంది. తొలి మ్యాచ్ ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగనుండగా ఇరు జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. వీటిలో 20 సార్లు KKR విజయం సాధించగా ఆర్సీబీ 14 సార్లు గెలుపొందింది. చివరి సారిగా ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచులో కేకేఆర్ గెలుపొందింది. రెండింటి మధ్య జరిగిన మ్యాచుల్లో కోహ్లీ(962) అత్యధిక పరుగులు చేశారు. మరి ఇవాళ్టి మ్యాచులో ఏ జట్టు డామినేట్ చేస్తుందో చూడాలి.
Similar News
News October 14, 2025
EPFO: ఆ నిబంధన ఎత్తివేత!

<<17996798>>EPFO<<>> మరిన్ని నిర్ణయాలు..
* చదువు కోసం 10, పెళ్లి విషయంలో 5సార్లు పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు. గతంతో వీటిపై పరిమితి(3 సార్లు) ఉండేది.
* విత్ డ్రా చేయడానికి గతంలో ప్రకృతి విపత్తు, నిరుద్యోగం తదితర కారణాలు చూపాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తేశారు.
* కనీస బ్యాలెన్స్ 25% కచ్చితంగా కొనసాగించాలి. దాంతో అధిక వడ్డీ రేటు పొందే వీలుంటుంది.
* విత్ డ్రా కోసం కనీస సర్వీస్ కాలాన్ని 12 నెలలకు తగ్గించారు.
News October 14, 2025
మామిడి రైతులకు డబ్బులు విడుదల

AP: తోతాపురి మామిడి విక్రయించిన రైతులకు ప్రభుత్వం నగదు విడుదల చేసింది. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల సబ్సిడీని జమ చేసింది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకూ ఎక్స్గ్రేషియా నిధులు రిలీజ్ చేసింది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 19 జిల్లాల్లో 106 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5.30కోట్లు జమ చేసింది.
* రోజూ అగ్రికల్చర్ వార్తల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి..
News October 14, 2025
పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి?

పూజ సమయంలో పూలు లేకపోతే చాలామంది వాటి బదులు అక్షింతలు కలిపి పూజ చేస్తుంటారు. అయితే పూలను అక్షింతలతో కలిపి పూజించవద్దని పండితులు చెబుతున్నారు. దీనివల్ల విఘ్నాలు వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఇంట్లో ఒకటి, రెండు పూలు మాత్రమే ఉంటే.. వాటిని ముందు దేవుడి పాదాల వద్ద ఉంచి, ఆ తర్వాత అక్షింతలను సమర్పించాలి. పూలు లేనప్పుడు కేవలం అక్షింతలతో పూజ చేసినా శుభ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. <<-se>>#POOJA<<>>