News March 19, 2025
IPL: కోహ్లీ బ్యాటింగ్.. సహచరుడు అంపైరింగ్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిన్ననాటి సహచరుడు తన్మయ్ శ్రీవాస్తవ IPLలో అంపైరింగ్ చేయనున్నారు. వీరిద్దరూ కలిసి 2008 అండర్-19 వరల్డ్ కప్లో ఆడారు. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాస్తవ (46) టాప్ స్కోరర్. ఆయన IPL (PBKS తరఫున) కూడా ఆడారు. శ్రీవాస్తవ క్రికెట్కు రిటైర్మెంట్ పలికి అంపైరింగ్ చేస్తున్నా కోహ్లీ ఇంకా క్రికెటర్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ పీక్స్లో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News November 22, 2025
త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: లోకేశ్

AP: వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో భేటీలో ఈమేరకు హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామన్నారు.
News November 22, 2025
త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: లోకేశ్

AP: వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో భేటీలో ఈమేరకు హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామన్నారు.
News November 21, 2025
మరికొన్ని గంటల్లో భారీ వర్షం

AP: బంగాళాఖాతంలో రేపు <<18351099>>అల్పపీడనం<<>> ఏర్పడనున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి రేపు ఉ.9 గంటల వరకు తిరుపతి, నెల్లూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రేపు మధ్యాహ్నానికి చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం దంచికొట్టిన విషయం తెలిసిందే.


