News March 25, 2024

IPL.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

image

టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో 100సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. దీంతో పాటు ఇదే మ్యాచ్‌లో అత్యధిక క్యాచులు(173) పట్టిన భారత ప్లేయర్‌గానూ అవతరించారు. బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఫీట్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో రైనా(172), రోహిత్(167) ఉన్నారు.

Similar News

News December 27, 2025

ఇంట్లో ఎలాంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి?

image

ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ‘విగ్రహాన్ని ఈశాన్యం, ఉత్తర లేదా తూర్పు దిశల్లో ఉంచాలి. లక్ష్మీదేవితో కలిసి ఉన్న విగ్రహం మరింత శుభప్రదం. విగ్రహం 6 అంగుళాల లోపు ఉండటం శ్రేయస్కరం. శేషశయనం కంటే నిలబడి/కూర్చున్న విగ్రహాలు నిత్య పూజకు మంచివి. విగ్రహాన్ని నేరుగా నేలపై కాకుండా పీఠంపై, మన ఛాతీ ఎత్తులో ఉండేలా చూసుకోవాలి’ అంటున్నారు.

News December 27, 2025

పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు అప్లై!

image

పుణేలో ఓ ప్రేమజంట విడాకులు నెట్టింట చర్చకు తెరలేపాయి. మ్యారేజ్ తర్వాత తాను మర్చంట్ నేవీలో డాక్టర్ అని భర్త చెప్పాడు. డ్యూటీకి వెళ్తే 6 నెలలు ఓడలోనే ఉండాల్సి వస్తుందని వివరించాడు. ఈ విషయం ముందే చెప్పాలి కదా అని భార్య నిలదీసింది. దీంతో వారు 24 గంటల్లోనే విడాకులకు అప్లై చేశారు. ఏ విషయమైనా పెళ్లికి ముందే చర్చించుకోవాలని, ఇలాంటివి అసలు దాచొద్దని నెటిజన్స్ అంటున్నారు.

News December 27, 2025

‘మేక్ ఇన్ ఇండియా’తో ఎలక్ట్రానిక్స్ రంగం పరుగులు: కేంద్రమంత్రి

image

ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్‌ రంగం ‘మేక్ ఇన్ ఇండియా’తో పరుగులు పెడుతోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘2014-15మధ్య 2 మొబైల్ తయారీ యూనిట్స్ ఉంటే ఇప్పుడు 300కు పెరిగాయి. రూ.18వేల కోట్లుగా ఉండే మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి రూ.5.5లక్షల కోట్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తి రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ.11.3 లక్షల కోట్లకు, వాటి ఎగుమతి రూ.3.3లక్షల కోట్లకు పెరిగింది’ అని <>ట్వీట్<<>> చేశారు.