News November 25, 2024
IPL: మ్యాజిక్ మ్యాన్.. భలే ఎత్తుగడలు!

ఇతర ఫ్రాంఛైజీల పర్స్ మనీని ఖాళీ చేయడంలో కిరణ్ కుమార్ గ్రంధి దిట్ట. GMR గ్రూప్స్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు కుమారుడైన కిరణ్ ప్రస్తుతం DC కో-ఓనర్గా ఉన్నారు. నిన్న పంత్ను లక్నో రూ.21 కోట్లకు కొనేందుకు సిద్ధమవ్వగా కిరణ్ కుమార్ RTMతో భయపెట్టి ఆ రేటును పెంచేలా చేశారు. ఫలితంగా పంత్ కోసం లక్నో రూ.27 కోట్లు పెట్టాల్సి వచ్చింది. అలాగే స్టార్ బౌలర్ స్టార్క్ను రూ.11.75 కోట్లకే దక్కించుకున్నారు.
Similar News
News October 20, 2025
వీటిని పాటిస్తే అంతా ఆరోగ్యమే: వైద్యులు

శరీర భాగాల ఆరోగ్యం కోసం రోజూ చేయాల్సిన పనులను వైద్యులు సూచిస్తున్నారు. ‘మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉదయాన్నే నీరు తాగండి. మెదడు & హార్మోన్ల కోసం రోజూ కోడిగుడ్లు తినండి. నడక & వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం అల్లం నీరు తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. సూర్యకాంతి వల్ల చర్మం ప్రకాశిస్తుంది. నిద్రకు ముందు పచ్చి వెల్లుల్లి తింటే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది’ అని సూచిస్తున్నారు. Share it
News October 20, 2025
బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
News October 20, 2025
ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: డీజీపీ

TG: నిజామాబాద్లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డీజీపీ శివధర్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. పదవీ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామని, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారాన్ని రేపు అమరవీరుల సభలో సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు.