News April 24, 2024

IPL: వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్

image

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ప్రస్తుతం 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 61 రన్స్ చేసింది. ప్రస్తుతం బట్లర్ 28*, జైస్వాల్ 31* క్రీజులో ఉన్నారు. RR విజయానికి 84 బంతుల్లో 119 రన్స్ కావాలి.

Similar News

News April 3, 2026

రాముడిగా తెలుగు హీరోల్లో ఎవరు బాగుంటారు?

image

ప్రస్తుత తెలుగు హీరోల్లో శ్రీ రాముడి గెటప్‌లో ఎవరు బాగుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా ‘రామాయణ’ టీజర్‌లో రణ్‌బీర్ రాముడిగా కనిపించడం, ‘వారణాసి’లో మహేశ్ బాబు కూడా ఆ పాత్రలో నటిస్తుండటంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని రాముడిగా చూడాలని కోరుకుంటున్నారు. మరి తెలుగు హీరోల్లో ఎవరు బాగా సెట్ అవుతారు? ఎవరు బాగా నటించగలరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News April 3, 2026

RED ALERT: రేపు 73 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

APలో ఎండలు ముదురుతున్నాయి. రేపు 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల 40-44 డిగ్రీలు రికార్డయ్యే ఛాన్సుందని రెడ్ అలర్ట్ ఇచ్చింది. కాగా ఇవాళ మన్యం(D) గుమ్మలక్ష్మీపురంలో 41.8, చిత్తూరు(D) పెద్దపంజనిలో 41.4, విజయనగరం(D)వంగరలో 41.1, చాలా ప్రాంతాల్లో 39-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 3, 2026

36 గంటలు మీసేవ కేంద్రాలు బంద్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో ఈ రాత్రి 8PM నుంచి 36 గంటల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్, షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఈ ప్రక్రియకు సుమారు 36 గంటలు పట్టే అవకాశం ఉంది. ఆదివారం ఉ.8 గంటల తర్వాత మీసేవ వెబ్‌సైట్ యాక్టివ్ అవుతుందని అధికారులు వెల్లడించారు.