News April 14, 2025

IPL: చరిత్ర సృష్టించిన MI

image

ఢిల్లీతో మ్యాచ్‌లో విజయం సాధించిన MI ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200+ స్కోర్‌ చేసిన ప్రతిసారీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు వరుసగా 15 మ్యాచుల్లో ఇలా గెలిచింది. DC కూడా వరుసగా 13 సందర్భాల్లోనూ ఓడిపోలేదు. అయితే 200+ స్కోర్‌ను CSK 21 సార్లు డిఫెండ్ చేసుకోగా ఐదుసార్లు ఓడిపోవడం గమనార్హం. ఆ తర్వాత RCB(W-19, L-5), SRH(W-15, L-2) ఉన్నాయి.

Similar News

News April 15, 2025

కెరీర్ పట్ల ఎలాంటి రిగ్రెట్ లేదు: భువనేశ్వర్

image

తన కెరీర్ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు గానీ పశ్చాత్తాపం గానీ లేదన్నారు. ఇంతకుమించి తానేమీ కోరుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ స్వింగ్ బౌలర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2022 నవంబర్‌లో ఆడారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న భువీ IPLలో అత్యధిక వికెట్లు(187) తీసిన పేసర్‌గా ఉన్నారు.

News April 15, 2025

పోలీసింగ్‌లో సౌతిండియా టాప్.. AP, TG ర్యాంకులు ఎంతంటే?

image

ఫోర్త్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం పోలీసింగ్, జైళ్లు, న్యాయవ్యవస్థ, న్యాయ సహాయంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. ఈ విభాగాల్లో కర్ణాటక టాప్ ప్లేస్ దక్కించుకోగా AP, TG, KL, TN టాప్-5లో ఉన్నాయి. బెంగాల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది సర్వేలో TG 11వ స్థానంలో నిలవగా ఈసారి మూడో ప్లేస్‌కి దూసుకొచ్చింది. ఇక గత పదేళ్లలో జైళ్లలోని ఖైదీల సంఖ్య 50శాతం పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది.

News April 15, 2025

రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె

image

AP: రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. తొలగించిన కార్మికులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. 14 వేల మంది సమ్మెలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముందు జాగ్రత్తగా రెగ్యులర్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.

error: Content is protected !!