News April 12, 2025
IPL: ప్లేఆఫ్స్.. ఏ జట్టుకు ఎంత ఛాన్స్?

ఈ ఏడాది ఐపీఎల్లో కొన్ని జట్లు అంచనాలను మించి అదరగొడుతుండగా మరికొన్ని టీమ్స్ ఘోర ఓటములతో ఢీలాపడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన 25 మ్యాచ్లను బట్టి ప్లేఆఫ్స్కు వెళ్లేందుకు ఏ జట్టుకు ఎంత అవకాశం ఉందో CricTracker అంచనా వేసింది. దీనిప్రకారం ఢిల్లీ(75%), గుజరాత్ టైటాన్స్(74%) టాప్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా KKR(55%), PBKS(52%), RCB(50%), LSG(47%), RR(26%), MI(11%), CSK(6%), SRH(4%) ఉన్నాయి.
Similar News
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


