News October 31, 2024
IPL: పంజాబ్ కింగ్స్ పర్సులో రూ.112 కోట్లు

పంజాబ్ కింగ్స్ తన ప్రధాన ఆటగాళ్లందరినీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్ను మాత్రమే రిటైన్ చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఆ జట్టు పర్సులో ఏకంగా రూ.112 కోట్లు ఉన్నాయి. మెగా వేలంలో నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకే పంజాబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. కాగా అన్ని ఫ్రాంచైజీల వద్ద దాదాపు రూ.45 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకే డబ్బులు మిగిలి ఉన్నాయి.
Similar News
News November 19, 2025
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న PM మోదీ

ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి 23 వరకు సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు. 22, 23 తేదీల్లో నిర్వహించనున్న 20వ G-20 సదస్సులో ఆయన పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘G-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జొహన్నెస్బర్గ్లో పర్యటించనున్నారు. ఈ సమ్మిట్లో ప్రధాని 3 సెషన్లలో ప్రసంగిస్తారు. వివిధ నేతలతోనూ భేటీ అవుతారు. ఇది ఓ గ్లోబల్ సౌత్ దేశంలో వరుసగా నాలుగోసారి జరుగుతున్న G-20 సదస్సు’ అని పేర్కొంది.
News November 19, 2025
అకౌంట్లో డబ్బులు పడలేదా.. ఇలా చేయండి

AP: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రాష్ట్రంలో ఇవాళ 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,200 కోట్లు <<18330888>>జమ<<>> చేశారు. కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల చొప్పున విడుదల చేశాయి. అకౌంట్లలో డబ్బులు పడనివారు <
News November 19, 2025
మహేశ్, నమ్రతల్ని కొడతా.. మంచు లక్ష్మి సరదా కామెంట్స్

తమ కుమార్తెలు సినిమాల్లోకి రాకుండా మేల్ యాక్టర్స్ నిరుత్సాహ పరుస్తున్నారని నటి మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘యాక్టర్స్ డాటర్స్’ సినిమా రంగంలో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. మహేశ్, నమ్రతల స్టార్ కిడ్ సితారకు మంచి విజిబులిటీ ఉందన్నారు. ‘నమ్రత ప్రగతిశీల మహిళ. స్త్రీలను ఎలా పైకి తేవాలో ఆమెకు తెలుసు’ అని పేర్కొన్నారు. సితారను బయటకు తీసుకురాకుంటే వారిద్దర్నీ కొడతానని సరదాగా వ్యాఖ్యానించారు.


