News April 18, 2024
IPL: పంజాబ్ టార్గెట్ 193 రన్స్

పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 192/7 స్కోర్ చేసింది. MI బ్యాటర్లలో సూర్య కుమార్ 78, రోహిత్ 36, తిలక్ 34 రన్స్తో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ 3, సామ్ కరన్ 2 వికెట్లు తీయగా, రబడ ఒక వికెట్ పడగొట్టారు.
Similar News
News February 5, 2026
T20 WC: భారత్ ఘన విజయం

T20 WC వార్మప్ మ్యాచ్లో SAపై భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (20 బాల్స్లో 53), తిలక్ వర్మ (19 బంతుల్లో 45) దూకుడుగా ఆడగా, హార్దిక్ పాండ్య (10 బంతుల్లో 30) చివర్లో మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
News February 5, 2026
దేశంలో ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

దేశంలో డిజిటల్ సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందరికీ ఆ ప్రయోజనాలు చేరడం లేదు. దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇప్పటికీ ఇంటర్నెట్కు దూరంగా ఉంది. సుమారు 13.7% కుటుంబాలకు ఆన్లైన్ సదుపాయం లేదు. అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఈ గ్యాప్ ఆందోళన కలిగిస్తోంది.
News February 5, 2026
T20WC: శాంసన్ కథ ముగిసినట్లేనా?

టీ20 వరల్డ్ కప్లో సంజూ శాంసన్కు అవకాశం దక్కడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వార్మప్ మ్యాచ్లో అతను బ్యాటింగ్కు రాకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. న్యూజిలాండ్తో సిరీస్లో పేలవ ప్రదర్శనతో సంజూ టీమ్ మేనేజ్మెంట్నే కాదు.. అభిమానులను కూడా ఎంతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను T20WCలో అవకాశం కోల్పోనున్నారని, అందుకే వార్మప్ మ్యాచ్లోనూ కనిపించలేదని చెబుతున్నారు.


