News September 28, 2024
IPL: ఆ ఆటగాళ్లకు రూ.18 కోట్లు?
ఒక్కో ఫ్రాంచైజీకి రిటెన్షన్ పర్స్ కింద రూ.75 కోట్ల వరకు బీసీసీఐ అనుమతించినట్లు తెలుస్తోంది. మొట్టమొదటగా రిటెన్షన్ చేసుకునే ఆటగాడికి, నాలుగో రిటెన్షన్ ఆటగాడికి రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. థర్డ్ రిటెన్షన్ రూ.11 కోట్లు, సెకండ్ అండ్ ఫిఫ్త్ రిటెన్షన్ ఆటగాడికి రూ.14 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.120 కోట్లలో మిగతా రూ.45 కోట్లతో మెగా వేలంలో ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.
Similar News
News September 29, 2024
ఆ ముగ్గురికీ బీసీసీఐ మొండిచేయి!
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు చోటు దొరకలేదు. దీనిపై వారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. బీసీసీఐ రాజకీయాల వల్ల వీరి కెరీర్ దెబ్బతింటోందని వాపోతున్నారు. సరైన కారణాలు లేకుండా కావాలనే వీరికి జట్టులో చోటు కల్పించట్లేదని ఆరోపిస్తున్నారు. జట్టులోకి రావాలంటే వారు ఇంకేం చేయాలని ప్రశ్నిస్తున్నారు.
News September 29, 2024
పురావస్తు శాఖపై ఢిల్లీ హైకోర్టు ఫైర్
ఢిల్లీలోని జామా మసీదును రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించకూడదన్న సంబంధిత ఫైల్ను సమర్పించడంలో పురావస్తు శాఖ విఫలమైందని ఢిల్లీ హైకోర్టు మండిపడింది. మసీదును ASI పరిధిలోకి తెస్తే ప్రభుత్వ పర్యవేక్షణ అధికమవుతుంది. దీంతో అలాంటి నిర్ణయం తీసుకోబోమని నాటి ప్రధాని మన్మోహన్ 2004లో షాహీ ఇమామ్కు హామీ ఇచ్చారు. దీన్ని ASI కూడా అంగీకరించింది. అయితే, సంబంధిత పత్రాలను సమర్పించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.
News September 29, 2024
హసన్ నస్రల్లా మరణం.. ఒక రోజు ఎన్నికల ప్రచారానికి ముఫ్తీ దూరం
పాలస్తీనా, లెబనాన్కు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సంఘీభావం ప్రకటించారు. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ఇతర అమరవీరులకు ఆమె సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తాను జమ్మూకశ్మీర్లో ఒకరోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండనున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో తాము పాలస్తీనా, లెబనాన్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు.