News August 24, 2024

IPL: రోహిత్ శర్మ కోసం రూ.50 కోట్లు?

image

ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడుతున్నాయని వార్తలొస్తున్నాయి. ఒకవేళ రోహిత్ ముంబైని వదిలేసి వేలంలోకి వస్తే రూ.50 కోట్లకు దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం. ఇందుకోసం ఆ రెండు ఫ్రాంచైజీలు రూ.50 కోట్ల పర్స్ మనీని సేవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టీంలకు ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ దక్కలేదు. దీంతో ఎలాగైనా హిట్‌మ్యాన్‌ను తీసుకోవాలని భావిస్తున్నాయని టాక్.

Similar News

News November 20, 2025

హిందీ Vs మరాఠీ వివాదం.. యువకుడు ఆత్మహత్య

image

హిందీ-మరాఠీ <<15354535>>వివాదం<<>> ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. MHలోని థానేకు చెందిన అర్ణవ్ ములంద్‌లోని కాలేజీకి వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. ఈక్రమంలోనే రైలులో హిందీ-మరాఠీపై చర్చ జరిగింది. ఇది కాస్తా గొడవకు దారి తీయడంతో ఐదుగురు యువకుల గ్యాంగ్ అర్ణవ్‌పై దాడి చేసింది. దీంతో అతడు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అర్ణవ్ తండ్రి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

News November 20, 2025

రెండో టెస్టుకు భారత జట్టులో మార్పులివేనా?

image

గువాహటిలో ఎల్లుండి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు భారత జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. గిల్ స్థానంలో సాయి సుదర్శన్, పిచ్ కండిషన్‌ను బట్టి అక్షర్ పటేల్ ప్లేస్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. ఒకవేళ సాయి సుదర్శన్‌ను తీసుకోకపోతే దేవదత్ పడిక్కల్‌కు అవకాశం ఇస్తారని సమాచారం. ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి.

News November 20, 2025

₹600Crతో TG పోలీసు AMBIS అప్‌గ్రేడ్

image

TG పోలీస్ శాఖ నేర పరిశోధన వేగాన్ని పెంచేందుకు ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(AMBIS)ను అప్‌గ్రేడ్ చేస్తోంది. పాతబడిన సర్వర్లు, స్టోరేజ్ స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ₹600Cr మంజూరు చేసింది. ఈ వ్యవస్థ అన్ని PSలలోని పరికరాలను లింక్ చేస్తుంది. AI సాయంతో సెకన్లలోనే బయోమెట్రిక్ మ్యాచింగ్ పూర్తవుతుంది.