News March 20, 2025

IPL: ముంబైకి షాక్

image

IPL: ఆదివారం CSKతో జరిగే తొలి మ్యాచులో ముంబై ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగనుంది. బుమ్రా గాయం ఇంకా తగ్గలేదని, కోలుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని కోచ్ జయవర్ధనే క్లారిటీ ఇచ్చారు. నిషేధం కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్య సైతం ఫస్ట్ మ్యాచుకు దూరమయ్యారు. అతడి స్థానంలో సూర్య కెప్టెన్సీ చేయనున్నారు. గత కొన్ని సీజన్లుగా ఫస్ట్ మ్యాచ్ ఓడుతూ వస్తోన్న MI.. ఈ స్టార్లు లేకుండా ఎలా ఆడుతుందో మరి!

Similar News

News November 25, 2025

లిప్స్‌కీ LED మాస్క్

image

ప్రస్తుతం LED మాస్క్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి సౌందర్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో లిప్స్‌కీ LED మాస్క్ వచ్చింది. దీన్ని నోటిపై పెట్టుకొని సపోర్ట్ హ్యాండిల్‌ని పళ్లతో పట్టుకోవాలి. డివైజ్ స్విచ్ ఆన్/ ఆఫ్ బటన్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల పెదాలపై ఉండే ముడతలు, గీతలు పోయి అందంగా మెరుస్తాయి. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.

News November 25, 2025

ఆకుకూరల సాగుకు నేల తయారీ, ఎరువులు

image

ఆకుకూరల సాగు కోసం నేలను 3-4 సార్లు దున్ని చదును చేయాలి. పంటను బట్టి నేల తయారీలో ఎకరాకు 6-10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 20 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10-20 కిలోల యూరియా, పొటాష్ ఎరువులు వేసి నేలను సిద్ధం చేయాలి. తర్వాత అధిక వర్షాలకు నీరు ఇంకిపోయే విధంగా ఎత్తు మడులను, వాన నీరు నిల్వ ఉండకుండా నేలను తయారు చేసుకోవాలి. ఎత్తు మడుల వల్ల భారీ వర్షాలు కురిసినా పంటకు తక్కువ నష్టం జరుగుతుంది.

News November 25, 2025

జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్ష

image

AP: జిల్లాల <<18381213>>పునర్విభజన<<>>, డివిజన్లు, మండలాల మార్పుచేర్పులపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. వారు ఇచ్చిన నివేదికపై సీఎం కసరత్తు చేస్తున్నారు.