News May 9, 2024

IPL: ముంబై కథ ముగిసింది

image

లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపుతో ముంబై ఇండియన్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. ప్రస్తుతం టాప్ 6లో ఉన్న జట్లే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబైకి ఏమాత్రం ఛాన్స్ లేదు. కాగా హార్దిక్ నేతృత్వంలో ముంబై ఈ సీజన్‌లో ఘోర ప్రదర్శన చేసింది.

Similar News

News January 23, 2026

పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

image

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.

News January 23, 2026

పిల్లలు ఎత్తు పెరగట్లేదా?

image

కొంతమంది పిల్లలు వయస్సుకు తగ్గట్లు ఎత్తు పెరగరు. ఇలా కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలంటున్నారు నిపుణులు. క్యారెట్, బీన్స్, బచ్చలికూర, బఠాణీ, అరటి, సోయాబీన్, పాలు, గుడ్లు డైట్‌లో చేర్చాలి. వీటిలో ఉండే కాల్షియం, మినరల్స్ పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. అలాగే రోజూ వ్యాయామం, సైక్లింగ్ చేయిస్తే గ్రోత్ హార్మోన్స్‌ పెరగడానికి దోహదం చేస్తాయి.

News January 23, 2026

TTD ట్రస్టులకు రూ.2.50 కోట్ల విరాళం

image

AP: TTDలోని పలు ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌ రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ రూ.2.50కోట్ల భారీ విరాళాన్ని శుక్రవారం అందించింది. శ్రీవేంకటేశ్వర ప్రాణ, విద్యాదాన ట్రస్టులకు చెరో రూ.75లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50లక్షలు, అన్నప్రసాదం, గోసంరక్షణ ట్రస్టులకు చెరో రూ.25లక్షల విలువైన డీడీలను TTD అదనపు EOకు సంస్థ అధినేత అందజేశారు.