News March 16, 2024

IPL టికెట్ల అమ్మకం షురూ

image

హైదరాబాద్‌లో జరగబోయే IPL తొలి మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు <>పేటీఎం ఇన్‌సైడర్‌<<>>లో అందుబాటులోకి వచ్చాయి. టికెట్ల కనిష్ఠ ధర రూ.1500లుకాగా గరిష్ఠ ధర రూ.30 వేలుగా ఉంది. ఇక ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక ఫ్యాన్ జెర్సీ ఉచితంగా పొందవచ్చని SRH బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Similar News

News February 5, 2026

ఫిరాయింపు ఆరోపణలు.. ఆ ఇద్దరే బాకీ!

image

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది MLAలలో 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్, సంజయ్, గూడెం మహిపాల్, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ పార్టీ మారారంటూ దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి మిగిలారు. దానం అనర్హత పిటిషన్‌పై ఈ నెల 18కి, కడియంకు 19కి విచారణను స్పీకర్ వాయిదా వేశారు.

News February 5, 2026

కల్తీ నెయ్యి కేసు.. ఇవాళ సీఎంతో పవన్, మాధవ్ భేటీ!

image

AP: కల్తీ నెయ్యి వ్యవహరంపై సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలకం సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 3న జరిగిన క్యాబినెట్ భేటీలో అసలు సూత్రధారులను పట్టుకునేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

News February 5, 2026

‘ధురంధర్’ సరికొత్త చరిత్ర!

image

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన బాలీవుడ్ చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది డిసెంబర్ 5న ఈ మూవీ విడుదలవ్వగా 1.3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(1.25 కోట్లు), జవాన్(1.24 కోట్లు), స్త్రీ2(1.11 కోట్లు) ఉన్నాయి.