News October 17, 2024

IPL: రోహిత్ శర్మ ఏ టీమ్ అంటే?

image

ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 31లోగా ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టును బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ముంబై రోహిత్, హార్దిక్, బుమ్రా, సూర్యలను రిటైన్ చేసుకోవచ్చని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తెలిపింది. ఇదే జరిగితే రోహిత్ శర్మకు ముంబై కెప్టెన్సీ ఛాన్స్ ఇస్తుందో లేదా పాండ్యను కొనసాగిస్తుందో అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News

News February 10, 2026

ఎల్లుండి నుంచి MLAలకు డిజిటల్ అటెండెన్స్!

image

AP: అసెంబ్లీకి కొందరు సభ్యులు గైర్హాజరు అవుతుండటంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు సభ్యుల ఫింగర్ ప్రింట్స్ నమోదు చేసి.. ఎల్లుండి నుంచి డిజిటల్ విధానంలో హాజరు తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే MLA తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. అటు రేపు జగన్‌తో పాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్తారని ఆ పార్టీ నేత బొత్స తెలిపారు.

News February 10, 2026

పాక్‌తో మ్యాచ్.. USA టార్గెట్ ఎంతంటే?

image

T20 WC USAతో మ్యాచులో పాకిస్థాన్ 190/9 రన్స్ చేసింది. 16 ఓవర్ల వరకు పాక్‌ను కాస్త కట్టడి చేసిన అమెరికా బౌలర్లు చివర్లో పరుగులు సమర్పించుకున్నారు. PAK బ్యాటర్లలో ఫర్హాన్ 73, బాబర్ 46 రన్స్‌తో రాణించారు. చివర్లో షాదాబ్ ఖాన్(12 బంతుల్లో 30 రన్స్) బ్యాట్ ఝళిపించారు. USA బౌలర్లలో షడ్లే 4 వికెట్లతో సత్తా చాటారు. మోహ్‌సిన్, హర్మీత్, నేత్రావల్కర్ తలో వికెట్ తీశారు. ఆ జట్టు టార్గెట్ 191 రన్స్.

News February 10, 2026

బాబ్రీ మసీదు నిర్మాణం జరగదు: UP CM యోగి

image

బాబ్రీ మసీదు నిర్మాణం ఎప్పటికీ జరగదని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘రామ్ లల్లా కోసం వస్తామని, ఆలయం నిర్మిస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఖయామత్ దినం రాదనేది నిజం. అలాంటప్పుడు బాబ్రీ నిర్మాణం ఎలా జరుగుతుంది? దాని గురించి కలలు కనొద్దు’ అని బారాబంకి సభలో అన్నారు. WB ముర్షిదాబాద్‌లో బాబ్రీ తరహా మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ లక్నో నుంచి మార్చ్ చేయనున్నట్టు హిందూ సంస్థలు ప్రకటించాయి.