News March 22, 2025

IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

image

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నారు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.

Similar News

News March 23, 2025

ఆస్పత్రిలో చేరిన అల్లు అర్జున్ నాయనమ్మ

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం (95) ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యులు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కాగా కనకరత్నం గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌కు అమ్మమ్మ అన్న విషయం తెలిసిందే.

News March 23, 2025

IPL చరిత్రలో అత్యధిక స్కోర్లు ఇవే..

image

287/3 – SRH vs RCB, బెంగళూరు, 2024
286/6 – SRH vs RR, హైదరాబాద్, 2025*
277/3 – SRH vs MI, హైదరాబాద్, 2024
272/7 – KKR vs DC, వైజాగ్, 2024
266/7 – SRH vs DC, ఢిల్లీ, 2024

News March 23, 2025

పర్చూరుకు రానున్న సీఎం చంద్రబాబు

image

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్నారు. చంద్రబాబు బాబు పర్యటన ఖరారు అయినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ జె. వెంకట మురళి ఆదివారం సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!