News April 6, 2025

IPL: హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్

image

ఈ రోజు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుండగా రాచకొండ సీపీ సుధీర్ బాబు ట్రాఫిక్ అలర్టు జారీ చేశారు. రామంతపూర్ నుంచి ఉప్పల్ వెళ్లేవారు హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8 మీదుగా, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ బోడుప్పల్ వెళ్లేవారు వయా నాగోల్ మెట్రో, ఉప్పల్ HMDA భగాయత్ మీదుగా, తార్నాక నుంచి ఉప్పల్ వెళ్లేవారు హబ్సిగూడ క్రాస్ నుంచి నాచారం మీదుగా వెళ్లాలని సూచించారు.

Similar News

News April 15, 2025

భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా మద్దూరు మండలం ఎంపిక

image

భూభారతిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశానికి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ హాజరయ్యారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సదస్సులను జిల్లాలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.

News April 15, 2025

ధోనీ రికార్డుల మీద రికార్డులు

image

CSK కెప్టెన్ ధోనీ నిన్నటి LSG మ్యాచ్‌లో రికార్డుల మీద రికార్డులు నమోదు చేశారు. IPLలో 200డిస్మిసల్స్(స్టంపౌట్లు, క్యాచ్‌లు, రనౌట్లు) చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచారు. అలాగే లీగ్ ప్రారంభం నుంచి అత్యధిక ఇన్నింగ్సుల్లో (132) సిక్సర్లు బాదిన బ్యాటర్‌గానూ ఘనత సాధించారు. మరోవైపు IPLలో అత్యధిక సార్లు(18) POTM అవార్డ్ గెలిచిన 2వ ప్లేయర్‌గా రికార్డులకెక్కారు. ఈ లిస్టులో తొలి స్థానంలో రోహిత్ (19) ఉన్నారు.

News April 15, 2025

అమరావతిలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ!

image

AP: అమరావతి ప్రాంతంలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి పక్కనే దీనిని ఏర్పాటు చేస్తారని సమాచారం. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియాలు, స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలోనే 1.25 లక్షల మంది కెపాసిటీ గల భారీ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నారు.

error: Content is protected !!