News November 22, 2024

విమానాల పైనుంచి దూసుకెళ్లిన ఇరాన్ మిస్సైల్స్?

image

గత నెలలో ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన 200 ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ పౌర విమానాల పైనుంచి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానాల్లో ప్రయాణిస్తున్న కొందరు పైలట్లు, ప్రయాణికులు నిప్పులు చిమ్ముతూ వెళ్తున్న మిస్సైళ్లను చూసినట్లు సమాచారం. ఈ మిస్సైళ్లతో పదుల సంఖ్యలో విమానాలకు పెనుముప్పు తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో పౌర విమానాలకు ఇరాన్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

Similar News

News November 24, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* ధర్మేంద్ర మృతికి సంతాపం తెలియజేసిన చంద్రబాబు, రేవంత్, పవన్
* రాముడి పాదాల వద్ద ఎన్టీఆర్ పార్టీలో చేరా.. NTR చలవతోనే అవినీతిమయ రాజకీయాల్లోనూ రాణిస్తున్నా: మంత్రి తుమ్మల
* గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై జీవో 46ను ఉపసంహరించుకోవాలన్న బీసీ సంఘాలు.. ప్రతి గ్రామంలో నిరాహార దీక్షలు చేయాలని తీర్మానం
* నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 331, నిఫ్టీ 108 పాయింట్లు దిగువకు

News November 24, 2025

ముంబైలో “పాతాళ్ లోక్” నెట్‌వర్క్‌

image

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.

News November 24, 2025

3 సిక్సులు కొట్టడమే గొప్ప!

image

పాకిస్థాన్‌కు చెందిన జీరో స్టూడియోస్‌ ఆ దేశ క్రికెటర్‌ సాహిబ్జాదా ఫర్హాన్‌పై “Hero in the Making” అనే డాక్యుమెంటరీ తీసింది. దానికి అసలు కారణం ఏంటంటే ఆసియా కప్‌ 2025లో అతను బుమ్రా బౌలింగ్‌లో 3 సిక్సులు కొట్టడమే. కాగా ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ పాక్‌ ఓడిపోవడం తెలిసిందే. దీంతో ‘3 సిక్సులు కొట్టడాన్నే వీళ్లు సక్సెస్‌గా ఫీల్ అవుతున్నారు’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.