News May 23, 2024
ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు పూర్తి

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన సొంత పట్టణం మషాద్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయనను చివరి చూపులు చూసేందుకు నగరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 63 ఏళ్ల రైసీ నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఇరాన్ వెళ్లి రైసీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
Similar News
News January 21, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరులోని <
News January 21, 2026
నెలసరిలో ఏం తినాలంటే..?

చాలామంది మహిళలు పీరియడ్స్లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, యాప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.
News January 21, 2026
ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

పీరియడ్స్లో అమ్మాయిలు చాలా అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకోసారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.


