News November 2, 2024
ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

తమపై కానీ, తమ మిత్ర దేశాలపై కానీ దాడులకు దిగితే ఇజ్రాయెల్, అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. తమ వైపు నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గత నెల 26న ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలు దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి.
Similar News
News November 3, 2025
‘చక్ దే ఇండియా2’ తీయాలని డిమాండ్.. కారణమిదే

18 ఏళ్ల కిందటి ‘చక్ దే ఇండియా’ గుర్తుందా? ప్లేయర్గా గెలవని హాకీ వరల్డ్ కప్ను కోచ్గా కబీర్ ఖాన్(షారుఖ్) సాధించడమే కథ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహిళల WC సాధించడంలో కోచ్ అమోల్ మజుందార్ది కీలక పాత్ర. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11 వేల రన్స్ చేసినా ఆయన ఇంటర్నేషనల్ డెబ్యూ చేయలేదు. కోచ్గా తన కల నెరవేర్చుకున్న అమోల్ కథతో చక్ దే2 తీయాలని నెటిజన్లు కోరుతున్నారు. మీరేమంటారు?
News November 3, 2025
CII సమ్మిట్లో రూ.2లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు: మంత్రి లోకేశ్

AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో CII పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ‘సమ్మిట్కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయి. వీటి విలువ రూ.2లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల 9లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది’ అని ప్రెస్మీట్లో వివరించారు.
News November 3, 2025
మరో 6 నెలలు కాల్పుల విరమణ: మావోయిస్టు పార్టీ

TG: రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత మే నెలలో ప్రకటించిన కాల్పుల విరమణను మరో ఆరు నెలలు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించింది.


