News April 11, 2025

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌పై IRCTC క్లారిటీ

image

రైల్వేలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్స్ మార్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని IRCTC స్పష్టం చేసింది. టికెట్ల బుకింగ్‌కు సంబంధించి టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. ట్రైన్ బయలుదేరే ముందు రోజు తత్కాల్ బుకింగ్ చేసుకునేవారికి ఏసీకి సంబంధించి ఉ.10 గంటలకు, నాన్ ఏసీ క్లాస్‌కు సంబంధించిన ఉ.11 గంటలకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Similar News

News April 18, 2025

అమెరికా వైమానిక దాడి.. యెమెన్‌లో 74 మంది మృతి

image

యెమెన్‌లోని ఆయిల్ పోర్టుపై US చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 74కు చేరింది. ఈ ఘటనలో 171 మంది గాయపడినట్లు హౌతీ గ్రూప్ వెల్లడించింది. నెలరోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇదే అత్యంత దారుణమైన దాడి అని తెలిపింది. కాగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై హౌతీల దాడులను ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. వారికి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో US ఆర్మీ హౌతీలపై విరుచుకుపడుతోంది.

News April 18, 2025

నటుడిపై ఫిర్యాదు వెనక్కి తీసుకుంటా: నటి

image

అసభ్యంగా ప్రవర్తించాడంటూ మలయాళ నటి విన్సీ అలోషియస్ ఓ నటుడిపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అది టామ్ చాకో అని బయటికి రావడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. ‘నేను అధికారుల్ని నమ్మాను. అతడి పేరు బయటికి రావొద్దని స్పష్టంగా చెప్పాను. అయినా పేరును లీక్ చేశారు. ప్రతిభావంతుడైన నటుడికి సినిమాల్లో అవకాశాలు ఆగకూడదు. తన తప్పును సరిదిద్దుకుంటాడన్నదే నా ఆశ’ అని పేర్కొన్నారు.

News April 18, 2025

US నిరాకరిస్తున్న వీసాల్లో 50శాతం భారత విద్యార్థులవే!

image

వలసదారులు, విద్యార్థులపై అమెరికా అనుసరిస్తున్న విధానంలో అత్యధికంగా భారత విద్యార్థులే ప్రభావితమవుతున్నారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్(AILA) నివేదిక ప్రకారం.. తిరస్కరణకు గురవుతున్న వీసాల్లో 50శాతం భారత విద్యార్థులవే ఉంటున్నాయి. చైనా మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నా ఆ దేశానికి చెందిన విద్యార్థుల వీసాల్ని అధికారులు కేవలం 14శాతమే రిజెక్ట్ చేస్తున్నారని అసోసియేషన్ తెలిపింది.

error: Content is protected !!