News December 4, 2024

IRCTC: ట్రైన్ ఆలస్యమైతే భోజనం ఫ్రీ

image

తాము ప్రయాణించాల్సిన ట్రైన్ 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ప్రయాణికులకు IRCTC ఉచిత భోజనం అందించనుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో అందుబాటులో ఉంది. టీ, కాఫీ, బిస్కెట్లు, బ్రెడ్, భోజనం ఆర్డర్ చేయొచ్చు. ట్రైన్ ఎక్కకముందే 3 గంటల కన్నా ఎక్కువ సమయం ఆలస్యమైతే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. వెయిటింగ్ రూమ్స్‌లో అదనపు ఛార్జీలు కూడా ఉండవు.

Similar News

News November 23, 2025

భారీ జీతంతో SIDBIలో ఉద్యోగాలు

image

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>SIDBI<<>>) 14 కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.లక్ష చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in/

News November 23, 2025

‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ ఎలా ఉందంటే?

image

OTTలో ట్రెండింగ్ వెబ్ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నుంచి మూడో సీజన్ విడుదలైంది. ఈశాన్య భారతంలో నడిచే కథతో దర్శకులు రాజ్, డీకే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. మనోజ్ బాజ్‌పాయ్ నటన, విజయ్ సేతుపతి క్యామియో, కొత్త పాత్రల్లో జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ అదరగొట్టారు. గత సీజన్లతో పోలిస్తే యాక్షన్ తక్కువగా ఉండటం, బలమైన కథ లేకపోవడం నిరాశపరుస్తాయి. చివర్లో సీజన్ 4 ఉందని హింట్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది?

News November 23, 2025

ఇతిహాసాలు క్విజ్ – 75 సమాధానాలు

image

ప్రశ్న: పాండవుల పక్షం వహించిన దృతరాష్ట్రుడి పుత్రుడెవరు?
జవాబు: పాండవుల తరఫున యుద్ధం చేసిన దృతరాష్ట్రుడి పుత్రుడు ‘యుయుత్సుడు’. ఆయన గాంధారి దాసి సుఖదకు జన్మించాడు. దాసీ పుత్రుడు అయినందుకు కౌరవులు దూరం పెట్టేవారు. ద్రౌపతి వస్త్రాపహరణాన్ని అడ్డుకున్నాడు. ధర్మంవైపు నిలిచి కౌరవులతో పోరాడాడు. కురుక్షేత్రంలో మరణించని కౌరవ వీరుడిగా నిలిచారు. ఆ తర్వాత హస్తినాకు సైన్యాధిపతిగా నియమించారు. <<-se>>#Ithihasaluquiz<<>>