News January 31, 2025
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుపై IRDAI గుడ్న్యూస్

ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDAI కీలక ఆదేశాలు ఇచ్చింది. సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ వార్షిక ప్రీమియాన్ని 10% కన్నా ఎక్కువ పెంచొద్దని స్పష్టం చేసింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఒకవేళ 10% కన్నా ఎక్కువ పెంచాలని భావించినా, ఈ స్కీములను రద్దు చేయాలనుకున్నా తమను కచ్చితంగా సంప్రదించాలని ఆదేశించింది. పరిమిత ఆదాయమే ఉండే వృద్ధులపై ఆర్థికభారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<