News January 13, 2025
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు: ఉత్తమ్

TG: ఖమ్మం(D) రఘునాథపాలెంలో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు భట్టి, తుమ్మల, కోమటిరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ శంకుస్థాపన చేశారు. ఉగాదిలోపే ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని, 27 చెరువుల కింద 2,400 ఎకరాలు ఆయకట్టులోకి రానుందని ఉత్తమ్ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేదే లక్ష్యమన్నారు. BRS ప్రభుత్వం ₹లక్ష కోట్లు వెచ్చించి లక్ష ఎకరాలను కూడా ఆయకట్టులోకి తీసుకురాలేదని విమర్శించారు.
Similar News
News October 31, 2025
నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్పేట్-1, రహమత్ నగర్, 5న షేక్పేట్-2, యూసుఫ్గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.
News October 31, 2025
IND, AUS మ్యాచులో నమోదైన రికార్డులు

* ఉమెన్స్ ODIsలో హైయెస్ట్ రన్ ఛేజ్ ఇదే(339)
* WC నాకౌట్ మ్యాచులో ఇదే ఫస్ట్ 300+ రన్ ఛేజ్
* ఉమెన్స్ ODI WC ఫైనల్కు భారత్ రావడం ఇది మూడోసారి. 2005, 2017లో రన్నరప్గా నిలిచింది
* WCలో AUS వరుస విజయాలకు(15M తర్వాత) బ్రేక్
* WC నాకౌట్ మ్యాచుల్లో ఛేజింగ్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా జెమీమా
* ఉమెన్స్ వన్డేల్లో 2 ఇన్నింగ్స్లు కలిపి ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్-679
News October 31, 2025
బాహుబలి యూనివర్స్లో కొత్త సినిమా ప్రకటన

బాహుబలి యూనివర్స్లో ‘బాహుబలి-ది ఎటర్నల్ వార్’ పేరిట 3D యానిమేటెడ్ మూవీ రాబోతోంది. ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా చివర్లో ఈ 3D మూవీ టీజర్ను థియేటర్లలో ప్లే చేశారు. 2027లో తొలి పార్ట్ రిలీజ్ కానుంది. కొత్త కథతో రూ.120కోట్ల బడ్జెట్తో దీనిని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. ఇందులో ఇంద్రుడు, బాహుబలి మధ్య యుద్ధాన్ని చూపిస్తారని తెలుస్తోంది.


