News March 21, 2024

ఐఆర్ఎస్ To ఉద్యమం To పాలిటిక్స్

image

కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హరియాణాలో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1999లో ఐఆర్ఎస్‌కి ఎంపికయ్యారు 1999-2000ల మధ్య పరివర్తన్ ఉద్యమాన్ని చేపట్టారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 2011లో అన్నా హజారేతో కలిసి జన లోక్‌పాల్ బిల్లు కోసం పోరాడి జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. 2012లో AAPని స్థాపించి రెండు సార్లు సీఎం అయ్యారు.

Similar News

News November 16, 2025

గురక గాఢనిద్రకు సంకేతం కాదు: వైద్యులు

image

చాలా మంది గురకను గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ అందులో నిజం లేదంటున్నారు వైద్యులు. ‘గురక అనేది గొంతులో గాలి వెళ్లే దారి ఇరుకై శ్వాసకు అడ్డంకులు ఏర్పడటం వల్ల వస్తుంది. దీని వలన నిద్రలో అంతరాయం ఏర్పడి గాఢనిద్ర పట్టదు. తరచుగా గురక వస్తున్నట్లయితే అది స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు’ అని చెబుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువగా గురక పెడితే వైద్యుడిని సంప్రదించండి.

News November 16, 2025

టీమ్ ఇండియా చెత్త రికార్డు

image

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో IND ఛేదించలేకపోయిన రెండో అత్యల్ప స్కోర్ (124) ఇదే. 1997లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచులో వెస్టిండీస్‌పై 120 పరుగులను ఛేజ్ చేయలేకపోయింది. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత రెండో లోయెస్ట్ టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైంది. అటు టెస్టుల్లో SA డిఫెండ్ చేసుకున్న రెండో అత్యల్ప టార్గెట్ ఇదే కావడం గమనార్హం.

News November 16, 2025

అల్లూరి జిల్లాలో బిర్సా ముండా విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ఒడిశా CM

image

AP: ఒడిశా సీఎం మోహన్ చరణ్ ఇవాళ అల్లూరి జిల్లాలో పర్యటించారు. గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకుని లగిశపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మోహన్ చరణ్‌కు రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సంధ్యారాణి, BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్‌ స్వాగతం పలికారు. స్థానిక గిరిజనులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా వీరత్వాన్ని కొనియాడారు.